Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీలో అధికారమే లక్ష్యంగా ‘యువగళం’ (Yuvagalam) కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ఆయన జనాల్లోకి వెళ్తూ పార్టీ ప్రతిష్టత పెంచుతూ వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆయన చేపట్టిన యాత్రకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. తాజాగా ఆయన పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్రలో 3 వేల కిలోమీటర్లు చేరడం పట్ల టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వైసిపి ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3000 కి.మీ. మైలురాయికి చేరింది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారుమూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ… pic.twitter.com/Y7XH3Kj7kA
— Lokesh Nara (@naralokesh) December 11, 2023
Also Read: Sandeep Vanga: జాక్ పాట్ కొట్టిన యానిమల్ డైరెక్టర్.. ఏకంగా 200 కోట్లు!