Yuvagalam: ‘యువగళం’ తో నారా లోకేశ్ రికార్డు, పాదయాత్ర 3వేల కి.మీ పూర్తి!

ఏపీలో అధికారమే లక్ష్యంగా నారా లోకేష్ ‘యువగళం’ (Yuvagalam)  కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - December 11, 2023 / 01:34 PM IST

Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఏపీలో అధికారమే లక్ష్యంగా ‘యువగళం’ (Yuvagalam)  కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ఆయన జనాల్లోకి వెళ్తూ పార్టీ ప్రతిష్టత పెంచుతూ వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆయన చేపట్టిన యాత్రకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. తాజాగా ఆయన పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది.

ఈ  సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్రలో 3 వేల కిలోమీటర్లు చేరడం పట్ల టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Sandeep Vanga: జాక్ పాట్ కొట్టిన యానిమల్ డైరెక్టర్.. ఏకంగా 200 కోట్లు!