Minister Roja : మంత్రి రోజా ‘సెల్ ‘ ర‌హ‌స్యం

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లిన మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్ అయింది. ఫోన్ క‌నిపించ‌క‌పోయే స‌రికి కంగారు ప‌డ్డారు.

  • Written By:
  • Publish Date - April 21, 2022 / 02:54 PM IST

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లిన మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్ అయింది. ఫోన్ క‌నిపించ‌క‌పోయే స‌రికి కంగారు ప‌డ్డారు. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగేశారు. సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. రోజా మొబైల్‌ను చోరీ చేసిన వ్య‌క్తిని గుర్తించారు. రోజా సెల్ ఫోన్‌ను త‌స్క‌రించిన స‌ద‌రు వ్య‌క్తి, ఫోన్‌తో కారు ఎక్కేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.
కారు నెంబ‌రు ఆధారంగా పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌లో రోజా సెల్ ఫోన్‌ను కొట్టేసిన స‌ద‌రు వ్య‌క్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోకి వెళ్లిన‌ట్టుగా గుర్తించారు. అక్క‌డికి ప‌రుగులు పెట్టిన పోలీసులు దొంగ‌ను ప‌ట్టుకున్నారు. అత‌డి నుంచి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అత‌డు కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది. చోరీకి గురైన మంత్రి ఫోన్ దొర‌క‌డంతో జాగ్ర‌త్త‌గా రోజాకు అప్ప‌గించారు. మొబైల్ ఫోన్ చోరీ గురైన స‌మ‌యం నుంచి తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు రోజా గుర‌య్యారు. ఫోన్ ను పోలీసులు తిరిగి తీసుకురావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ ఫోన్ దొరికే వ‌ర‌కు నానా హైరానా ప‌డ‌డం గ‌మ‌నార్హం. ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజాకు సొంత జిల్లాకు వెళ్లిన రోజా బుధ‌వారం తిరుమ‌ల‌లో క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. గురువారం నాడు తిరుప‌తిలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న ఆమె మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆమెను స‌న్మానించేందుకు అధికారులు, వైసీపీ నేత‌లు పోటీ ప‌డ్డారు. ఫ‌లితంగా అక్క‌డ భారీ జ‌న సందోహం నెల‌కొంది. ఇదే అద‌నుగా ఓ వ్య‌క్తి రోజా మొబైల్ ఫోన్‌ను కొట్టేశాడు. దీంతో రోజా కంగారు ప‌డ‌డం అక్క‌డ ఉండే వాళ్ల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగింది. సెల్ ఫోన్ ర‌హ‌స్యంపై మాట్లాడుకోవ‌డం వినిపించింది.