Site icon HashtagU Telugu

AP Capital : రాజధాని విషయంలో మాట మార్చిన మంత్రి అంబటి

Ambati Rambabu Tweet

Ambati Rambabu Tweet

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ తమ ప్రణాళికలతో , హామీలతో , వాగ్దానాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) మరోసారి రాజధాని (AP Capital) విషయంలో మాట మర్చి ..ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టిడిపి.. అమరావతి (Amaravati)ని రాజధానికి చేసింది. కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పింది. అక్కడ పనులు కూడా మొదలుపెట్టారు..ఆ తర్వాత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి..వైసీపీ అధికారంలోకి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

అధికారం లోకి వచ్చిన వైసీపీ..రాజధాని అమరావతి కాదని..మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి..ఐదేళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా చేసింది. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ..ఇప్పుడు అమరావతే రాజధాని అంటూ పాత పాట పాడడం మొదలుపెట్టింది. ఇది ఎవరో అన్నది కాదు స్వయంగా మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణది అనైతిక పొత్తు అని రాంబాబు విమర్శించారు. ప్రత్యర్థుల్లో గందరగోళ పరిస్థితి తలెత్తిందని.. జనసేన పొత్తు.. బీజేపీతోనా? టీడీపీతోనా? అంటూ ఆయన ప్రశ్నించారు.

Read Also : Water Issue : కేసీఆర్ అనుమతితోనే జగన్ కృష్ణా జలాలను తరలించుకొని పోయారు – ఉత్తమ్