ఏపీలో ఎన్నికల సమరం వాడివేడిగా నడుస్తుంది. ఇటు కూటమి , అటు వైసీపీ , కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తూ..ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తమ తమ అభ్యర్థుల కోసం సినీ స్టార్స్ సైతం ప్రచారం చేస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ కోసం రామదండులా చిత్రసీమ కలిసొస్తుంది. కొంతమంది నేరుగా రంగంలోకి దిగి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తుండగా..మరికొంతమంది వెనుకాల ఉండి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి , మాజీ మంత్రి జయప్రద..కూటమి అభ్యర్ధికి సపోర్ట్ తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద .. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురందేశ్వరి పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని , ఆమె పిలిస్తే..తప్పకుండ వచ్చి ప్రచారం చేస్తానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నట్టు తెలిపారు. జగన్ పాలన బాగుందా? అన్న ప్రశ్నకు జయప్రద నవ్వుతూ ముందుకు నడుస్తూ.. బాగుందో లేదో రిజల్ట్ వచ్చాక మీకే తెలుస్తుందిలే! అని తెలిపింది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా , రాజధాని లేవు. వాటికోసం పోరాడతాను.ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో.. శాశ్వత రాజధాని కడతారో వారికే నా మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు.
Read Also : Venkatesh : ఖమ్మం లో వెంకటేష్ ప్రచారం..ఫ్యామిలీ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే అన్నమాట ..!!