Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై `సైకో` లాజిక‌ల్ ముద్ర‌! పార్టీ లీడ‌ర్ల వాయిస్ దుమారం!

`జ‌గ‌న్మోహన్ రెడ్డి సైకో..`(Jagan)అంటూ ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 3, 2023 / 11:20 AM IST

`జ‌గ‌న్మోహన్ రెడ్డి సైకో..`(Jagan)అంటూ ప్ర‌త్య‌ర్థులు మొద‌టి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నేత‌లు `సైకో`(psycho) ఆరోప‌ణ‌ను నిజం చేస్తున్నారు. ఆయ‌న బాడీ లాగ్వేజ్, నాలుగు గోడ‌ల మ‌ధ్య ఆయ‌న మాట‌లు త‌దితరాల గురించి తొలి  రోజుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తొలి రోజుల్లో హీరో రాజ‌శేఖ‌ర్ రెడ్డి దంప‌తులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెట్టారు. ఆ త‌రువాత పార్టీని వీడిన జూపూడి ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర లీడ‌ర్లు ఆనాడు రాజ‌శేఖ‌ర్ దంప‌తులు చెప్పిన మాట‌ల‌నే చెప్పారు. ప్ర‌త్యేకించి వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హారం ఎలా ఉంటుంది? అనేది పూస‌గుచ్చిన‌ట్టు చెబుతారు. సూటిగా చూస్తూ ఎవ‌రితోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడ‌ర‌ని చెబుతుంటారు.

జ‌గ‌న్మోహన్ రెడ్డి సైకో..`(Jagan)

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (Jagan) `ఇగో` ఎక్కువ‌ని ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లుమార్లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న సొద‌రుడు చిరంజీవి న‌మ‌స్కారం చేస్తే, ప్ర‌తి న‌మ‌స్కారం చేయ‌లేద‌ని ప‌లు వేదిక‌ల‌పై చెప్పారు. అంతేకాదు, సినిమా హీరోల‌ను అంద‌ర్నీ తాడేప‌ల్లి ఇంటికి పిలిపించుకుని నిల‌బెట్టార‌ని చెబుతారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు టాలీవుడ్ దూరంగా ఉంద‌ని క‌సి తీర్చుకుంటున్నాడ‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే టాప్ హీరోల‌ను తాడేప‌ల్లి ఇంటి వ‌ద్ద బ‌య‌టే కార్ల‌ను ఆపించి లోప‌ల‌కు న‌డిపించాడ‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెబుతుంటారు. ఇగోల‌ను తీర్చుకోవ‌డానికి సీఎం ప‌ద‌విని ఇవ్వ‌లేద‌ని, సేవ చేయ‌డానికి ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేస్తుంటారు.

Also Read : Jagan power : ఏపీలో గుజ‌రాత్, యూపీ ఫార్ములా, ప్ర‌త్య‌ర్థుల‌పై`కోవ‌ర్ట్ `పాలిటిక్స్?

సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే ప్ర‌జా వేదిక‌ను కూల్చివేసిన రోజు నుంచి `సైకో` (psycho) అంటూ టీడీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఫేక్ సీఎం, గాలి సీఎం, సైకో సీఎం త‌దిత‌ర ప‌దాల‌ను వాడుతూ టీడీపీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా తీసుకెళ్లింది. ప్ర‌త్య‌ర్థి పార్టీల ఆఫీస్ ల‌పై దాడులు, త‌గుల బెట్ట‌డం, ఇళ్ల‌లోకి వైసీపీ క్యాడ‌ర్ ను పంప‌డం తదిత‌ర ఘ‌ట‌నల‌ను గుర్తు చేస్తూ సైకో సీఎంగా టీడీపీ, జ‌న‌సేన త‌ర‌చూ చెబుతాయి. కానీ, సొంత పార్టీ వాళ్లు, ఎమ్మెల్యేలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని `సైకో` గా చెప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దుట్టా తిరుగుబాటు బావుటా..

తాజాగా గ‌న్న‌వ‌రం వైసీపీ నేత‌లు దుట్టా రామ‌చంద్ర‌రావు, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని `సైకో`గా చెప్పుకుంటూ ఉండే ఆడియో చ‌క్క‌ర్లు కొడుతోంది. గ‌తంలోనూ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన లీడ‌ర్లు కొంద‌రు ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ తో క‌లిసి ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురించి ఆయ‌న మ‌న‌స్త‌త్వంపై మాట్లాడుకున్న వీడియో అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టంచింది. ఇప్పుడు గుంటూరులోని వైకుంఠ‌పురం వ‌ద్ద దేవాల‌యం ప్రారంభానికి వెళ్లిన దుట్టా, యార్ల‌గ‌డ్డ మాట్లాడుకున్న ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని `సైకో`గా మాట్లాడుకంటూ ఆ సంభాష‌ణ కొన‌సాగింది. ఆ ఆడియోలోని సంభాష‌ణ త‌మ‌ది కాద‌ని దుట్టా, యార్ల‌గ‌డ్డ ఖండిస్తున్నారు.

Also Read : Jagan IPS-IAS : ఇద్ద‌రూ ఇద్ద‌రే.! టీడీపీ లీడ‌ర్ల‌కు ద‌డ ! జ‌గ‌న్ కు క‌ళ్లూ, చెవులు!

ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ. ఆయ‌న టీడీపీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో గెలిచారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పంచ‌న చేరారు. టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గ‌న్న‌వ‌రం నుంచి పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అక్క‌డ ఉన్న వైసీపీ లీడ‌ర్లు దుట్టా రామ‌చంద్ర‌రావు, యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావుల‌తో వ‌ల్ల‌భ‌నేనికి ప‌డ‌దు. వాళ్ల మ‌ధ్య జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా పంచాతీయ కుదిర్చారు. అయిన‌ప్ప‌టికీ `దుట్టా` మాత్రం వ‌ల్ల‌భ‌నేని తో క‌లిసి ప‌నిచేయ‌లేన‌ని తేల్చి చెప్పారు. కానీ, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు మాత్రం పార్టీకి కట్టుబ‌డి ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వ‌ల్ల‌భ‌నేని, కొడాలి పై ఆస్తుల గురించి దుట్టా ప్ర‌శ్నిస్తున్నారు. అంటే, తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. ఆ క్ర‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని `సైకో` అంటూ యార్ల‌గ‌డ్డ‌, దుట్టా మాట్లాడుకున్న సంభాష‌ణ బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం.