Gorantla Madhav : గోరంట్ల `డ‌ర్టీ పిక్చ‌ర్` క‌థ‌నంపై `వాసిరెడ్డి` స్పంద‌న‌

`డ‌ర్డీ పిక్చ‌ర్` పై ఆ న‌లుగురు అనే శీర్షిక‌తో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియోపై ఏపీ మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ మౌనంపై హ్యాష్ ట్యాగ్ యూ రాసిన క‌థ‌నంకు స్పంద‌న ల‌భించింది.

  • Written By:
  • Updated On - August 8, 2022 / 02:38 PM IST

`డ‌ర్డీ పిక్చ‌ర్` పై ఆ న‌లుగురు అనే శీర్షిక‌తో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియోపై ఏపీ మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ మౌనంపై హ్యాష్ ట్యాగ్ యూ రాసిన క‌థ‌నంకు స్పంద‌న ల‌భించింది. ఎట్ట‌కేల‌కు వాసిరెడ్డి ప‌ద్మ రియాక్ట్ అయ్యారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన మూడో రోజు ఆమె స్పందిస్తూ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. వీడియో వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ లేఖ‌ను డీజీపీకి అందించారు. ఈ ఘ‌ట‌న‌లోని నిజాల‌ను నిగ్గు తేల్చాల‌ని కోరారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అది మార్ఫింగ్ వీడియో అంటూ గోరంట్ల మాధవ్ ఢిల్లీలో మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అది ఫేక్ వీడియో అని తేలుతుందని ఆయన ధైర్యంగా చెబుతున్నారు. కానీ, ఆ వీడియో నిజ‌మ‌ని టీడీపీ చెబుతోంది. పైగా గోరంట్ల మాధ‌వ్ మాట్లాడుతూ కొంద‌రు టీడీపీ వాళ్లు చేసిన ప‌నిగా న్యూడ్ వీడియోకు రాజ‌కీయాన్ని పులిమారు.

ఒరిజినల్ వీడియోనే అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాయ‌డం మొత్తం ఎపిసోడ్‌ను కొత్త మ‌లుపు తిప్పుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా క‌మిష‌న్ స్పందించ‌క‌పోవ‌డాన్ని మీడియా ప్ర‌శ్నించింది. ప్ర‌త్య‌ర్థి పార్టీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీసింది. ఎట్ట‌కేల‌కు వాసిరెడ్డి ప‌ద్మ స్పందించ‌డంతో గోరంట్ల మాధ‌వ్ న‌గ్న వీడియో కాల్ పై స్ప‌ష్ట‌త వ‌స్తుందేమో చూద్దాం.