ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

Andhrapradesh Govt  ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ పాలసీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీఏసీఎస్‌‌కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ సంబంధిత సమస్యల్ని ఈ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ కీలక ఉత్తర్వులు జార చేసిన ఏపీ […]

Published By: HashtagU Telugu Desk
Andhra Pradesh Logo

Andhra Pradesh Logo

Andhrapradesh Govt  ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ పాలసీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీఏసీఎస్‌‌కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ సంబంధిత సమస్యల్ని ఈ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ
  • కీలక ఉత్తర్వులు జార చేసిన ఏపీ ప్రభుత్వం
  • అలాగే ఉన్నతస్థాయి కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఏసీఎస్‌ (ప్రాథమిక సహకార పరపతి సంఘాల) ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ఈ ఉద్యోగులకు సంబంధించి హెచ్‌ఆర్‌ పాలసీ అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై వరకు తీసుకోనున్న చర్యల్ని ప్రధానంగా వివరించారు. ఈ నెలాఖరులోగా పీఏసీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి కీలక చర్యలు చేపడతారు. డీఎల్‌ఈసీ ద్వారా పేస్కేల్స్‌ ధ్రువీకరణ, నిర్ధారణ, అమలు.. సర్వీస్‌ రిజిస్టర్ల అప్‌డేట్, ధ్రువీకరణపై సమాచారం ఇస్తారు. ఉద్యోగులకు సంబంధించిన కోర్టు/విజిలెన్స్‌ కేసులతో సహా మాస్టర్‌ డేటాబేస్‌ ప్రిపేర్ చేస్తారు. ఉద్యోగులకు సంబంధించిన జీతాల పెంపు సామర్థ్యం, పీఏసీఎస్‌ల వర్గీకరణతో పాటుగా ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఖర్చులకు కామన్‌పూల్‌ ఎకౌంట్‌ అమలు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటారు.

ఈ మేరకు ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగుల 12 డిమాండ్లతో పాటుగా వాటిపై తీసుకున్న చర్యలను జీవోలో వివరించారు. ‘మార్చి నుంచి జులై వరకు అదనపు స్టాఫ్, ఖాళీల గుర్తింపు, మూడేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు, అవసరమైన పీఏసీఎస్‌లకు అదనపు సిబ్బంది నియామకం, కొత్తగా నియమించిన/పదోన్నతి ఇచ్చిన వారికి శిక్షణ, సామర్థ్యం, డీఎల్‌ఈసీల ద్వారా పదోన్నతులు, వన్‌మేకర్‌ వన్‌చెకర్‌ మోడల్‌ కింద డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్’ వంటి చర్యలు చేపడతారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల) కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ పీఎసీఎస్‌‌ల ఆర్థిక పరిస్థితి పాటుగా ఉద్యోగుల హెచ్‌ఆర్‌ సంబంధిత సమస్యల్ని పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ కమిటీలో పలు కీలక అధికారుల్ని సభ్యులుగా నియమించారు. ‘వ్యవసాయ శాఖ ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా కమిటీ ఉంటుంది. ఆప్కాబ్‌ ఎండీ సభ్య కన్వీనర్‌‌గా ఉంటారు. సహకార శాఖ కమిషనర్, నాబార్డు సీజీఎం సభ్యులుగా ఉంటారు’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ పీఏసీఎస్‌ల ఆర్థిక పరిస్థితిని ప్రధానంగా పరిశీలిస్తుంది. అలాగే పీఏసీఎస్‌ల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల్ని కూడా సూచిస్తారు. హెచ్‌ఆర్‌‌కు సంబంధించిన సమస్యలు, సర్వీసు కండిషన్లు, సుస్థిర అభివృద్ధి, సామర్థ్య పెంపు, నైపుణ్యం కల్పించడం, సంక్షేమ చర్యలు, సర్వీస్‌ డెలివరీ మెరుగుపరచడం వంటి వాటిని కూడా కమిటీ సిఫార్సు చేయనుంది.

 

  Last Updated: 18 Feb 2026, 10:16 AM IST