Sunil Kumar : సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ను మరో 4 నెలలు పొడిగింపు

అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సునీల్‌కుమార్‌ వైసీపీ పనిచేసి వివాదాస్పదుడిగా ముద్రపడింది.

Published By: HashtagU Telugu Desk
Former CID chief PV Sunil Kumar suspension extended for another 4 months

Former CID chief PV Sunil Kumar suspension extended for another 4 months

Sunil Kumar : మరో 4 నెలల పాటు సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ను పొడిగించారు. ఈ మేరకు 2025 ఆగస్టు 28 వరకు సస్పెన్షన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన అభియోగంపై సునీల్‌కుమార్‌పై వేటు పడింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సునీల్‌కుమార్‌ వైసీపీ పనిచేసి వివాదాస్పదుడిగా ముద్రపడింది.

Read Also: Fact Check : భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు.. నిజమేనా ?

ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా జగన్ హయాంలో సునీల్‌కుమార్‌ తరచూ విదేశాల్లో పర్యటించారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి పొంది యూకేలో పర్యటించారు. 2019 డిసెంబరు నుంచి 2024 మార్చి మధ్య మొత్తం ఆరుసార్లు పీవీ సునీల్‌కుమార్‌ ఇలా విదేశాల్లో పర్యటించినట్లు కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ కె.విజయానంద్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం సస్పెన్షన్‌ను పొడిగించారు. కాగా, ఒకటి, రెండు సందర్భాల్లో అనుమతి పొందినా, ఆ దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. అమలాపురానికో, భీమవరానికో వెళ్లొచ్చినంత తరచుగా దుబాయ్‌కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ అనుమతి లేని పర్యటనలే. జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని… నేరుగా యూఏఈలో వాలిపోయేవారు.

కాగా, సునీల్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనపై చర్యలు తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా కొందరు విమర్శిస్తున్నారు. ఇతరులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.​
సునీల్ కుమార్‌పై విచారణలు కొనసాగుతున్నాయి. ఈ విచారణల ఫలితాలు ఆయన భవిష్యత్తు నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు ఏపీ పోలీస్ శాఖలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.​ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ పొడిగింపు, ఆరోపణలు, విచారణలు, రాజకీయ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Bomb Threats : కేరళ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు

  Last Updated: 28 Apr 2025, 03:25 PM IST