తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్కు కేబుల్ సరఫరా చేసే ఫాక్స్లింక్ పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఇక్కడ ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జింకలమిట్ట గ్రామంలో ఉన్న ఈ పరిశ్రమలో పనిచేస్తున్న దాదాపు 750 మంది మంటలు చెలరేగిన వెంటనే బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఫెసిలిటీలో ఫైబర్, షీట్లు, స్పాంజ్ నిల్వ చేయడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. మొత్తం పరిశ్రమను మంటలు చుట్టుముట్టాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో కేబుల్స్ తయారు చేసే ఫాక్స్లింక్లో మంటలు చెలరేగాయని రేణిగుంట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రామచంద్ర తెలిపారు. అగ్నిమాపక దళం సకాలంలో అక్కడికి చేరుకోవడంతో మంటలు ఒక్క షెడ్డుకే పరిమితమయ్యాయని.. డైనింగ్ ఏరియా, వంట గదుల్లో ఉన్న మిగతా రెండింటికి వ్యాపించలేదని రామచంద్ర తెలిపారు.
మూడింటిలో అతి పెద్ద షెడ్ కాలిపోయిందని.., మిగిలిన రెండు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. అతి పెద్ద షెడ్డులో ఉత్పత్తి అంతా జరుగుతుందన్నారు. అగ్నిమాపక మరియు విద్యుత్ శాఖల సమన్వయంతో నష్టాన్ని అంచనా వేస్తున్నందున కంపెనీ ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని ఆయన తెలిపారు. 1986లో స్థాపించబడిన ఫాక్స్లింక్ అనేక గ్లోబల్ టెక్ బెహెమోత్లకు కేబుల్ అసెంబ్లీలు, కనెక్టర్లు, పవర్ మేనేజ్మెంట్ పరికరాలు, బ్యాటరీ ప్యాక్లను డిజైన్ చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 15 డిజైన్, తయారీ మరియు విక్రయాల సైట్లతో తైపీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది.