Site icon HashtagU Telugu

TTD : ఏఐతో భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

Devotees can have darshan of Lord Shiva in 1-2 hours with AI: TTD Chairman BR Naidu

Devotees can have darshan of Lord Shiva in 1-2 hours with AI: TTD Chairman BR Naidu

TTD : తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో భక్తులకు 1-2 గంటల్లో దర్శనమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భక్తుల సంక్షేమమే టీటీడీ యొక్క ప్రాధాన్య లక్ష్యమని స్పష్టం చేశారు. దర్శన సమయాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, టికెట్ వ్యవస్థను తిరిగి రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉదయం టికెట్లు తీసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం దర్శనం చేయగలిగేలా సమయాల మార్పులను అమలులోకి తేవాలని భావిస్తున్నారు.

Read Also: Shashi Tharoor : మరోసారి శశి థరూర్ భిన్న స్వరం..‘అనర్హత’ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు

టీటీడీలో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిపై కూడా సంస్థ దృష్టి సారించింది. ఈ తరహా సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేయడమో, లేక వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించడమో చేస్తామని నాయుడు తెలిపారు. అదేవిధంగా టీటీడీ పరిపాలనా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఎవరైనా అన్యమత ప్రచారాల్లో పాల్గొంటే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ ద్వారా ఒంటిమిట్టలో నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్టు నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ రూ.4 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 12 మంది వైకాపా అనుచరులకు తిరుమలలో హోటళ్లను కేటాయించారని, ఆ వ్యవస్థ మొత్తం మాఫియాలా తయారైందని నాయుడు విమర్శించారు. ప్రస్తుతం ఈ-టెండర్ల విధానం ద్వారా పారదర్శకతతో హోటళ్ల కేటాయింపు జరుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను తిరుమలలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.

శ్రీవారి దర్శనాల సందర్భంలో, అలాగే ప్రసాదాల అంశంలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు తితిదే సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా అలిపిరిలో స్కానర్లు అప్‌డేట్ చేయడం, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచడం మొదలైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో వీఐపీ దర్శనాలు ఉదయం 10 గంటల వరకు కొనసాగడం వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తేవని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీఐపీ దర్శనాలను ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్య ముగించేలా చర్యలు చేపడుతున్నట్టు నాయుడు వెల్లడించారు. ఈ మార్పులతో పాటు భక్తులకు మరింత అనుకూలంగా సమర్థవంతంగా సేవలు అందించేందుకు టీటీడీ నిరంతరం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన తెలిపారు. భక్తుల సంతృప్తే తమకు ప్రధానమైన లక్ష్యమని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు.

Read Also: Mushrooms : వర్షాకాలంలో పుట్టగొడుగులు తినొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు