Site icon HashtagU Telugu

Cyclone Jawad : మ‌రో 12 గంట‌ల్లో తుఫానుగా మార‌నున్న అల్ప‌పీడ‌నం

Jawad

Jawad

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి జవాద్ తుపానుగా మారనుంది. శనివారం ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. గురువారం అర్థరాత్రి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ మధ్యకు ఆనుకుని ఉన్న అల్పపీడనం శుక్రవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరో 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని… శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక జారీ చేసింది.
జవాద్ తుపాను వల్ల తలెత్తే దుష్పరిణామాలను నిరోధించేందుకు ఒడిశా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ ఫైర్ సర్వీసెస్, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడిఆర్‌ఎఫ్) సహా 266 బృందాలను మోహరించాలని ప్రభుత్వం యోచిస్తోందని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు.

త‌ఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ద‌మైంది. 14 తీరప్రాంత జిల్లాలను అప్రమత్తం చేశాన‌మ‌ని.. మరియు రాబోయే తుఫాను దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల‌కు ఆదేశించిన‌ట్లు ప్ర‌దీప్ కుమార్ జెనా తెలిపారు.జవాద్ తుఫాను ప్ర‌భావంతో స‌ముద్రంలో చేప‌ట వేట‌ను నిషేధించిన‌ట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు ఒడిశా మొత్తం తీరప్రాంతంలోని ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టడం నిషేధిం విధించ‌బ‌డింది.