Movie Tickets Issue: నోటి దూల‌తో మొత్తం చెడేలా చేస్తున్నారే..!

సినిమా టికెట్ రేట్లు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి, తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కి మ‌ధ్య ఇష్యూ కొన‌సాగుతూనే ఉంది. టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు, ఏపీ ప్ర‌భుత్వం పై నోటికి వ‌చ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆ వివాదం తీవ్ర‌స్థాయికి చేరింది.

  • Written By:
  • Updated On - February 5, 2022 / 01:48 PM IST

సినిమా టికెట్ రేట్లు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి, తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కి మ‌ధ్య ఇష్యూ కొన‌సాగుతూనే ఉంది. టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు, ఏపీ ప్ర‌భుత్వం పై నోటికి వ‌చ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆ వివాదం తీవ్ర‌స్థాయికి చేరింది. ఓ నాలుగు రోజులు ఆర్జీవీ కూడా ఏపీ స‌ర్కార్ పై ట్వీట్లు చేయ‌డం, ఆ త‌ర్వాత మంత్రి పేర్ని నానితో చ‌ర్చ‌లు జ‌రిపి కామ్ అయిపోయాడు. ఇక టికెట్ రేట్ల‌ వివాదం పీక్స్‌లో ఉన్న‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి, చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు, టికెట్ రేట్లు గురించి చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ని, ఏపీ ప్ర‌భుత్వం, అధికార‌పార్టీ నాయ‌కుల పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయోద్ద‌ని రిక్వెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే టాలీవుడ్ జ‌నాల‌కు మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్ పై కామెంట్స్, సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. టికెట్ రేట్లు విష‌యం ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప‌రిశీల‌నో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఈలోపు మాత్రం ఇండ‌స్ట్రీ నుండి ఎవ‌రో ఒక‌రు ఏపీ ప్ర‌భుత్వం పై నోటిదూల ప్ర‌ద‌ర్శించి వ్య‌వ‌హారం మొత్తం చెడేలా చేస్తున్నారు. తాజాగా రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ మ‌చ్చ ర‌వి ట్విట్ట‌ర్‌లో జ‌గ‌న్ పై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు.

అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంద‌ని జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. దీంతో మ‌చ్చ ర‌విలాంటి చిన్న ద‌ర్శ‌కుడికి కూడా ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలుసైపోయార‌ని వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి అన‌వ‌స‌రంగా మ‌రోసారి జ‌గ‌న్‌ను కెలికిన నేప‌ధ్యంలో టికెట్ల వివాదం ఎలాంటి మ‌లుపు తిరుతుందో చూడాలి. ఏది ఏమైనా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ కొంద‌రు నోటీ దూల త‌గ్గించుకోకుంటే, ఇండ‌స్ట్రీకే చేట‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.