NCBN Tweets: హిందూదేవుళ్లకు జ‌గన్ అవ‌మానంపై బాబు ట్వీట్‌

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లిన ప్ర‌తీసారి ఏదో ఒక వివాదం నెల‌కొంటోంది. ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం క్రిస్టియ‌న్ గా ఉన్న జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌కుండా ఆల‌యంలోకి వెళ్ల‌డానికి లేదు.

  • Written By:
  • Updated On - September 28, 2022 / 03:30 PM IST

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లిన ప్ర‌తీసారి ఏదో ఒక వివాదం నెల‌కొంటోంది. ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం క్రిస్టియ‌న్ గా ఉన్న జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌కుండా ఆల‌యంలోకి వెళ్ల‌డానికి లేదు. పైగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు దంప‌తులు వెళ్లి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీ. కానీ, ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌కుండా తిరుమ‌ల శ్రీవారికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక్క‌రే వెళ్లి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తారు. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి తిరుమ‌ల కొండ వైపు కూడా చూడ‌రు.

తాజాగా ప‌ట్టువ‌స్త్రాల‌ను శ్రీవారికి అప్ప‌గించ‌డానికి వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తిరుప‌తి వెళ్లారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న వెళ్లే మార్గం అంత‌టా గోడ‌ల‌పై ఉన్న‌ హిందూ దేవుళ్లు చిత్రాల‌ను తొల‌గించారు. వాటి స్థానంలో వైసీపీ జెండాలోని మూడు రంగుల‌ను గోడ‌ల‌కు వేయ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేస్తూ ఫోటోను పెట్టారు. `ఆధ్మాత్మిక‌ పట్టణం #తిరుపతిలో హిందూ దేవుళ్లు & దేవతల చిత్రాలను అధికార YSR కాంగ్రెస్ పార్టీ రంగులతో భర్తీ చేయడం చూసి షాక్ అయ్యారు. హిందూ మతాన్ని అవమానించే ఈ లక్ష్య చర్యలపై భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.` అంటూ చంద్ర‌బాబు ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలోనూ హిందూమ‌తాన్ని, దేవుళ్ల‌ను కించ‌ప‌రిచే సంఘ‌ట‌న‌లు ఏపీ వ్యాప్తంగా జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగాయ‌ని టీడీపీ గుర్తు చేస్తోంది. తిరుమ‌ల వెళ్లే బ‌స్సు టిక్కెట్ల వెనుక జెరూస‌లెం యాత్ర ప‌బ్లిసిటీ ఇచ్చిన వైనం బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌రువాత తిరుమ‌ల కొండ‌పై అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రిగిన సంఘ‌ట‌న‌లు వెలుగుచూసిన విష‌యాన్ని టీడీపీ గుర్తు చేస్తోంది. హిందూ దేవుళ్ల విగ్ర‌హాలు, ర‌థం కాలిపోవ‌డం, హ‌నుమాన్ విగ్ర‌హాలు చేతులు విర‌చ‌డం, రామ‌తీర్థం శ్రీరాముని విగ్ర‌హం త‌ల‌న‌ర‌క‌డం త‌దిత‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వాట‌న్నింటినీ గుర్తు చేస్తోన్న టీడీపీ తాజాగా తిరుమ‌ల శ్రీవారికి ప‌ట్టువ‌స్ట్రాలు ఇవ్వ‌డానికి తిరుప‌తి వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచిన అంశాన్ని చంద్ర‌బాబు ట్వీట్ ద్వారా తెర‌మీద‌కు తీసుకురావ‌డం సంచ‌ల‌నంగా మారింది.