Chandrababu : నేడు కర్నూలు, నెల్లూరు లో చంద్రబాబు ప్రచారం

రాయలసీమలో ఈసారి అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఆయన పర్యటనలు సాగుతున్నాయి

Published By: HashtagU Telugu Desk
Chandrababu (2)

Chandrababu (2)

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓ పక్క ఎండ వేడి తట్టుకోలేక వైసీపీ అభ్యర్థులు ఎక్కడిక్కడే కుప్పకూలిపోతుంటే..74 ఏళ్ల వయసున్న చంద్రబాబు మాత్రం 25 ఏళ్ల యువకుడిలా ఉత్సాహంతో ప్రచారం చేస్తుంటే..టీడీపీ నేతలు , శ్రేణులే కాదు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. బాబు హెల్త్ సీక్రెట్ ఏంటా..అని మాట్లాడుకుంటున్నారు. ప్రతి రోజు రోడ్ షోస్ , ర్యాలీ లో , సభలు , సమావేశాలతో నిమిషం కూడా వృధా చేయడం లేదు. ఓ పక్క కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చేయబోయే పనుల గురించి వివరిస్తూ..వైసీపీ పార్టీ దారుణాలు గురించి వివరిస్తూ వస్తున్నారు. ఈరోజు కర్నూల్, నెల్లూరు లో ప్రచారం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కర్నూలు జిల్లాలో కోడుమూరు, మంత్రాలయంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. రాయలసీమలో ఈసారి అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఆయన పర్యటనలు సాగుతున్నాయి. అభ్యర్థులను పరిచయంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చంద్రబాబు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లూరులోని కోటమిట్ట వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ముస్లింలతో ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కర్నూల్ జిల్లా కౌతాళంలో, రాత్రి 7 గంటలకు గూడూరులో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రాత్రికి గూడూరులోనే ఆయన బస చేయనున్నట్లు సమాచారం.

Read Also : YS Sharmila : 2024 మేనిఫెస్టో లో ప్రత్యేక హోదా ప్రస్తావన ఏది?

  Last Updated: 28 Apr 2024, 11:36 AM IST