ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆలయాల వద్ద జరుగుతున్న తొక్కిసలాట ఘటనలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల తిరుపతి, సింహాచలం దేవాలయాల్లో భక్తులు గుమికూడడంతో జరిగిన ప్రమాదాలపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా YCP నేత బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) మాట్లాడుతూ.. ప్రభుత్వమే ఈ ఘటనలకు పూర్తి బాధ్యత వహించాల్సిందని డిమాండ్ చేశారు. భక్తుల భద్రతను కాపాడాల్సిన సమయంలో నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని ఈ ప్రభుత్వానికి దేవుడంటే గౌరవం లేదని బొత్స ఘాటుగా విమర్శించారు.
Kalki 2898 AD : కల్కి టీం కు షాక్ ఇచ్చిన దీపిక..నెక్స్ట్ ఎవరు..?
దీనికి ప్రతిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy ) కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలోనే ఆలయాలు భ్రష్టు పట్టాయని ఆరోపిస్తూ, ఆ కాలంలోనే దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. అటువంటి ఘటనలకు బాధ్యత వహించాల్సిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు YCP సభ్యులు రాజీనామా చేయాలంటూ ఆనం డిమాండ్ చేశారు. ఆలయ భక్తి, భద్రత పట్ల YCP ద్వంద్వ వైఖరి చూపుతోందని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలతో మండలిలో డైలాగ్ వార్ తారస్థాయికి చేరుకుంది. ఒకవైపు YCP ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని బొత్స ఆరోపిస్తుండగా, మరోవైపు మంత్రి ఆనం గత ప్రభుత్వం పనితీరును ప్రస్తావిస్తూ ప్రతివాదం చేశారు. ఆలయాలలో జరిగే తొక్కిసలాటలపై భద్రతా చర్యలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, భక్తుల ప్రాణరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సభలో పలువురు సభ్యులు సూచించారు. ఈ వాదోపవాదాల మధ్య ప్రజల దృష్టి మాత్రం ఆలయాల భద్రతా చర్యలపై పడింది.
