Bus Mishap: వాగులో ప‌డిన బ‌స్సు.. 9మంది మృతి

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు

  • Written By:
  • Updated On - December 15, 2021 / 05:15 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రమాదసమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని .. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదము ఉందని అధికారులు అన్నారు.

 

గాయపడినవారు ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బస్సు వంతెనను ఢీ కోటి వాగులో పడింది. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు పడవల సహాయంతో ప్రయాణికులను వడ్డుకు చేర్చారు.