Site icon HashtagU Telugu

AP CID: ఏపీ సీఐడీకి భంగ‌పాటు

Ayyanna

Ayyanna

ఏపీ సీఐడీకి న్యాయ‌స్థానాల్లో త‌ర‌చూ భంగ‌ప‌డుతోంది. అరెస్ట్ చేసిన వాళ్ల‌ను జైళ్ల‌కు పంపించ‌లేక పోతున్నారు. అంటే, బ‌ల‌మైన కార‌ణాల‌తో నిందితుల‌ను అరెస్ట్ చేయ‌డంలేద‌ని అర్థం. రిమాండ్ విధించ‌కుండా న్యాయ‌స్థానాల నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసులు పెడుతున్నార‌ని టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌లకు బ‌లాన్ని ఇస్తోంది. మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు అరెస్ట్ విష‌యంలోనూ సీబీఐ భంగ‌ప‌డింది.

అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఈ కేసులో అయ్యన్నతో పాటు రాజేశ్ కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి ఈ కేసులో సీఐడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టవచ్చంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవ‌లం 2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:   Amaravati: అమ‌రావ‌తి పై `సుప్రీం` ఆశ‌

నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేయడంతో పాటు నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.