సచివాలయంలో సుదీర్ఘంగా సాగిన ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సమావేశం ముగిసింది. కర్నూలుకు న్యాయ రాజధాని(Capital) హంగులు ఏర్పాడేలా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, విశాఖ టెక్ పార్కు కు 60 ఎకరాలు కేటాయిస్తూ, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ ఆ దిశగా క్యాబినెట్ ఆమోదాలు కనిపించడం గమనార్హం.
నవరత్నాలతో పాటు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న డ్వాక్రా గ్రూపుల రుణాలను నాలుగు విడతలుగా చెల్లించడానికి(AP Cabinet) ప్రభుత్వం సిద్ధమైయింది. ఆ మేరకు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది. నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు యూనిట్కు రూ. 2 చొప్పున విద్యుత్ ను అందించాలని భారీ రాయితీని ప్రకటించింది.
అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ (AP Cabinet) ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో 55 వేల కోట్లు, రెండో విడతలో 55 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక న్యూ ఎనర్జీ పార్క్ తో పాటు కర్నూల్,(Capital)అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలో విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను ఎనర్జి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 4 విడతల్లో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీనితో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
Also Read : AP Capital : ఏపీ రాజధాని అమరావతి, తేల్చేసిన కేంద్రం!
వైద్యారోగ్యశాఖలో రిక్రూట్ మెంట్ల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుకై కేబినెట్(Ap Cabinet) నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. జేఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రా స్ట్రక్శ్చర్ లిమిటెడ్ సంస్థకు రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తులను కేటాయించాలని నిర్ణయించారు. నామినేషన్ పద్దతిలో ఈ బెర్తులను కేటాయించారు. జేఎస్.డబ్ల్యూ సంస్థకు 250 ఎకరాల భూమిని మారిటైమ్ బోర్డు ద్వారా కేటాయించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. టీటీడీకి ప్రత్యేక వింగ్ ఏర్పాటుకై కేబినేట్ ఆమోదం తెలిపింది.
తాడేపల్లిగూడెంలో పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొన్ని జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాల వారీగా విభజించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు , ఒంగోలు, విజయనగరం , మచిలీపట్నం, నంద్యాల(Capital), అనంత, చిత్తూరు జిల్లాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించనున్నారు. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనివర్శిటిల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. డీఎస్సీ క్యాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో నియమించే కీలక నిర్ణయం జగన్ క్యాబినెట్(AP Cabinet) తీసుకుంది.