Dharmavaram Public Meeting: గూండారాజ్యాన్ని తరిమికొట్టేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయి: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అవినీతి, నేర, మాఫియా, మతమార్పిడి రాజకీయాలపై పోరాడేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

Dharmavaram Public Meeting: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అవినీతి, నేర, మాఫియా, మతమార్పిడి రాజకీయాలపై పోరాడేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ వైసీపీపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ‘గూండాగిరి’ మరియు నేరాలను తరిమికొడుతుందని షా చెప్పారు. అవినీతిని, భూమాఫియాను నిర్మూలిస్తుందని అన్నారు. అలాగే అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దేందుకు, తిరుమల బాలాజీ ఆలయ పవిత్రతను పునరుద్ధరించేందుకు, తెలుగు భాషను కాపాడేందుకు అమరావతిని పునర్నిర్మిస్తాం అని అమిత్ షా అన్నారు.అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించినందుకు నరేంద్రమోడీని కొనియాడుతూ.. అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ మాత్రమే హాజరు కాలేదన్నారు.

దేశంలో తొలి రెండు దశల్లో బీజేపీ 100 సీట్లు గెలుచుకుంటుందని, మూడో విడత లోక్‌సభ ఎన్నికల నాటికి 400 మార్కుకు చేరుకుంటుందని అన్నారు. కూటమి నుంచి ఎంపీ అభ్యర్థులను ఎన్నుకోవాలని, కేంద్రంలో నరేంద్ర మోదీని బలపరచాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ఆయన కోరారు.

We’re now on WhatsApp : Click to Join

చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని దేశంలోనే నంబర్ వన్ రాజధాని నగరంగా తీర్చిదిద్దుతాం అన్నారు. అమరావతి, పోలవరానికి కట్టుబడి ఉన్న అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు 2024 జూన్ 4న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి బీజేపీ-టీడీపీ-జేఎస్పీ కూటమి పునరంకితమవుతుందని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఉండదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ క్రియాశీల మద్దతుతో అమరావతిని దేశంలోనే నంబర్ వన్ రాజధాని నగరంగా తీర్చిదిద్దుతాం అన్నారు చంద్రబాబు.

Also Read: Rahul Gandhi : దేశంలో ఉన్న ధనికుల కోసం బిజెపి పనిచేస్తుంది – రాహుల్ గాంధీ