రెచ్చిపోయిన అంబటి రాంబాబు కూతురు .. ఏంటి అంత మాట అనేసింది

తన తండ్రిపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి తెగబడ్డారని, మహిళా కార్యకర్తలు సైతం బూతులతో విరుచుకుపడ్డారని శ్రీజ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి ఆగ్రహంతో కొన్ని వ్యాఖ్యలు చేసినా, వెంటనే పశ్చాత్తాపం చెందారని ఆమె పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Ambati Sreeja

Ambati Sreeja

Ambati Sreeja : ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఉదంతం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన తండ్రిపై జరిగిన దాడి మరియు అరెస్టుపై అంబటి చిన్న కుమార్తె శ్రీజ చేసిన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మొత్తం ఉదంతం ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని, దీని వెనుక ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి కనుసన్నలు ఉన్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. పేరు ప్రస్తావించనప్పటికీ, ఆమె వ్యాఖ్యలు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక ఉన్నత విద్యావంతుడు, వైద్యుడు అయి ఉండి ఇలాంటి దాడులను ప్రోత్సహించడం దారుణమని, తన తండ్రిని వేధించి వారు రాక్షసానందం పొందారని ఆమె వాపోయారు. రాజకీయాలతో సంబంధం లేని తమ కుటుంబ సభ్యులను కూడా అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రిపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి తెగబడ్డారని, మహిళా కార్యకర్తలు సైతం బూతులతో విరుచుకుపడ్డారని శ్రీజ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి ఆగ్రహంతో కొన్ని వ్యాఖ్యలు చేసినా, వెంటనే పశ్చాత్తాపం చెందారని ఆమె పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తమ ఇంటి కిటికీలు, తలుపులు, వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రక్షణ కల్పించాలనే వంకతో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారని, ఆ సమయంలో ఒక సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా ఆయనను పోలీసులు భౌతికంగా హింసించారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

తమకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని శ్రీజ ధీమా వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికంటే పదింతల మంది అభిమానులు తమకు అండగా నిలిచారని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా తమ ఇంటికి వచ్చి భరోసా కల్పించారని ఆమె తెలిపారు. “రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు” అంటూ ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేస్తూ, దేవుడే తమకు రక్షణ కవచమని ఆమె పేర్కొన్నారు.

  Last Updated: 06 Feb 2026, 11:31 AM IST