Donald Trump: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, వ్యూహాత్మకంగా కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిలో తమ సైన్యం ఓ రహస్య ఆపరేషన్ నిర్వహించిందని ప్రకటించారు. గత నెలలో జరిగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును సురక్షితంగా తరలించామని, ఈ విషయం ఇరాన్‌కు ఇప్పుడే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా చూశామని తెలిపారు. బుధవారం […]

Published By: HashtagU Telugu Desk
US retaliatory strikes on Iran

US retaliatory strikes on Iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, వ్యూహాత్మకంగా కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిలో తమ సైన్యం ఓ రహస్య ఆపరేషన్ నిర్వహించిందని ప్రకటించారు. గత నెలలో జరిగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును సురక్షితంగా తరలించామని, ఈ విషయం ఇరాన్‌కు ఇప్పుడే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా చూశామని తెలిపారు.

బుధవారం ఓవల్ ఆఫీసులో మాట్లాడిన ట్రంప్, ఆ తర్వాత తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో మరిన్ని వివరాలు పంచుకున్నారు. “గత నెలలో హ‌ర్మూజ్ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలు ప్రయాణించేందుకు సహకరించాలని మన గొప్ప యూఎస్ సైన్యాన్ని నేను ఆదేశించాను. ఈ ప్రయత్నం ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు జలసంధిని దాటి బహిరంగ మార్కెట్‌లోకి చేరిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. 200కు పైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయి” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు (ప్రస్తుతం బ్యారెల్‌కు 85-90 డాలర్లు) భారీగా పెరగకుండా నిలకడగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఆంక్షల కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నామని, మిషన్‌కు ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచామని ఆయన వివరించారు. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హ‌ర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, గ్యాస్‌లో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండానే వెళ్తుంది.

అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ తీసుకుంటున్న చర్యలతో ఈ ప్రాంతంలో నౌకాయానం తీవ్రంగా దెబ్బతింది. ఇటీవలే జలసంధిపై అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసింది. శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై మరింత కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరిస్తూనే, దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

అయితే, ట్రంప్ దీనిని ‘రహస్య ఆపరేషన్’ అని చెబుతున్నప్పటికీ, ఇది పూర్తిగా కొత్త విషయం కాదని ఓ సీనియర్ సైనిక అధికారి ‘న్యూయార్క్ టైమ్స్‌’తో మాట్లాడుతూ సూచించారు. గతంలో ప్రకటించిన విధంగానే వాణిజ్య నౌకలకు మార్గనిర్దేశం చేసే ప్రయత్నానికి సంబంధించిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ చమురును తరలించే కార్యకలాపాల గురించి తనకు తెలియదని అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ చెప్పినట్లు కథనాలు రావడం గమనార్హం. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారులు తక్షణమే స్పందించలేదు. ఈ ప్రాంతంలో ప్ర‌స్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

  Last Updated: 11 Jun 2026, 11:03 AM IST