Pakistan Blast: రేపు ఎన్నికలు.. ఈ రోజు బాంబు పేలుళ్లు: 25 మంది మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పార్లమెంటు ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం రెండు బాంబులు పేలాయి . ఈ పేలుళ్లలో 25 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు .

Pakistan Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పార్లమెంటు ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం రెండు బాంబులు పేలాయి . ఈ పేలుళ్లలో 25 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు .

పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వెలుపల మొదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు మరియు 30 మంది గాయపడ్డారు. ఇది జరిగిన గంటలోపే కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్-ఉలేమా ఇస్లాం-పాకిస్తాన్ ఎన్నికల కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులు, బలూచిస్థాన్ వేర్పాటువాదులు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల అభ్యర్థులను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా భద్రతా సిబ్బందిని పెంచుతున్నట్లు సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ తెలిపారు. ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Rama- Krishna Tulsi: కృష్ణ తులసి, రామ తులసికి తేడా, వాటిలో ఏ తులసిని ఇంట్లో నాటాలంటే?