PM Modi: పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో మార్పు ఉండదు

పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై

PM Modi: పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశ సాంప్రదాయ విధానానికి తన నిబద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా, మానవతా ప్రాతిపదికన పాలస్తీనాకు భారతదేశం సహాయాన్ని కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాదిరిగానే ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పూర్తిగా మానవతా చట్టాలను అనుసరించాలని భావిస్తుంది.

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ గురువారం సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో తెలిపారు. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తులకు తన సంతాపాన్ని తెలియజేశారు. మానవతా ప్రాతిపదికన మేము పాలస్తీనా ప్రజలకు సహాయాన్ని అందిస్తూనే ఉంటాము. అలాగే ఈ ప్రాంతంలో తీవ్రవాదం, హింస మరియు క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇప్పటికే ఉన్న భారతదేశం యొక్క సూత్రప్రాయ విధానాన్ని కొనసాగించనున్నట్టు మోడీ అన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడి హమాస్ దాడిలో మరణించిన ఇజ్రాయెల్ ప్రజలకు తన సంతాపాన్ని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌తో ఉన్నారని మోడీ చెప్పారు.

మానవతా దృక్పథంతో ఇప్పటికే పాలస్తీనాకు భారత్ సాయం చేస్తోంది. 2022 నుండి 2023 వరకు భారతదేశం పాలస్తీనాకు 29.5 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది. ఈ సహాయం ఐక్యరాజ్యసమితి ద్వారా అందించబడుతుంది. 2023-24 మరియు 2024-25 సంవత్సరాల్లో పాలస్తీనాకు 5 మిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని అందించనున్నట్లు భారతదేశం ప్రకటించింది. మరేదైనా నిర్ణయం తీసుకుంటే దాని సమాచారం ప్రకటించనున్నట్టు విదేశాంగ తెలిపింది

Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ.