Pakistan Man Killed Wife: పాకిస్థాన్‌లో దారుణం.. భార్య‌, పిల్ల‌ల‌ను గొడ్డ‌లితో న‌రికి హ‌త్య‌

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఓ వ్యక్తి తన 7 మంది పిల్లలు, భార్యపై గొడ్డలితో దాడి చేసిన షాకింగ్ కేసు (Pakistan Man Killed Wife) పాకిస్థాన్ నుండి వెలుగులోకి వచ్చింది.

  • Written By:
  • Updated On - April 12, 2024 / 12:28 PM IST

Pakistan Man Killed Wife: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఓ వ్యక్తి తన 7 మంది పిల్లలు, భార్యపై గొడ్డలితో దాడి చేసిన షాకింగ్ కేసు (Pakistan Man Killed Wife) పాకిస్థాన్ నుండి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సజ్జాద్ ఖోఖర్ అనే వ్యక్తి తన పిల్లలు, భార్యను పోషించలేకపోతున్నాడని దాని కారణంగా అతను ఈ హత్యకు పాల్పడ్డాడని అక్క‌డి నివేదిక‌లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఔషధాలు, ఆహారం వంటి ప్రాథమిక వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పాకిస్థాన్ నుంచి నిరంతరంగా వార్తలు వస్తున్నాయి.

పీటీఐ కథనం ప్రకారం.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సజ్జాద్ ఖోఖర్ తన భార్యతో పాటు 7 మంది మైనర్ పిల్లలను హత్య చేశాడు. డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిందితుడు తరచూ భార్యతో గొడవ పడేవాడని చెబుతున్నారు. ఈ క్రూరమైన నేరం తర్వాత పంజాబ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో సజ్జాద్ 42 ఏళ్ల భార్య కౌసర్, నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు మృతి చెందారు.

Also Read: AAP : రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిం: మంత్రి అతిశీ

నిందితుడు పోలీసులకు ఏం చెప్పాడు?

నిందితుడు గొడ్డలితో తన కుటుంబాన్ని హతమార్చాడని, నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు మీడియాకు తెలిపారు. తన పిల్లలకు, భార్యకు భోజనం పెట్టలేనని.. అందుకే హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన పాకిస్థాన్‌తో పాటు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే పాక్‌లో పరిస్థితి అదుపు తప్పిందంటే సామాన్యులు డబ్బులేమితో తమ కుటుంబాలను నాశనం చేసుకోవాల‌ని చూసే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇమ్రాన్ ఖాన్ భయాన్ని వ్యక్తం చేశారు

మరోవైపు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైలు నుంచి ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో పాక్ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ఆర్థిక స్థిరత్వం లేకుండా ఏ దేశమూ నడవదని ఇమ్రాన్ అన్నారు. పాకిస్థాన్‌లో ఇటీవలి రాజకీయ పరిణామాలకు, 1971లో జరిగిన ఢాకా దుర్ఘటనకు మధ్య పోలిక పెట్టాడు. పాకిస్థాన్‌లో ఢాకా విషాదం చోటుచేసుకుంటుందన్న భయాన్ని ఇమ్రాన్ వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp : Click to Join