Iran Shooting: ఇరాన్‌లో జరిగిన కాల్పుల్లో 9 మంది పాకిస్థానీలు మృతి

ఇరాన్ లో విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లో పాకిస్థానీలుగా గుర్తించబడిన విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో కనీసం తొమ్మిది మంది మరణించారని

Published By: HashtagU Telugu Desk
Iran Shooting

Iran Shooting

Iran Shooting: ఇరాన్ లో విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లో పాకిస్థానీలుగా గుర్తించబడిన విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో కనీసం తొమ్మిది మంది మరణించారని స్థానిక మీడియా రాయిటర్స్ నివేదించింది. వివరాలలోకి వెళితే

ఇరాన్‌లోని సిస్తాన్ మరియు బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని సిక్రాన్‌లో ఆదివారం జరిగిన సాయుధ దాడిలో తొమ్మిది మంది పాకిస్థానీలు మరణించారని అక్కడి మీడియా నివేదించింది. ముగ్గురు ముష్కరులు పాకిస్థాన్ జాతీయులపై కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగిందని ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అలీరెజా మర్హమతి, అలీరెజా మర్హమతి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ విషాద ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు, పాకిస్థాన్ ప్రజలకు మర్హమతి సానుభూతి తెలిపారు. ఇరాన్ పోలీసు బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ముష్కరులు సంఘటన స్థలం నుండి పారిపోయారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.

Also Read: KCR : కేసీఆర్ ఓడిపోవడానికి KA పాల్ కారణమట..!!

  Last Updated: 11 Feb 2024, 06:47 PM IST