Site icon HashtagU Telugu

Jerusalem Attack: ఇజ్రాయిల్ లో విషాదం.. కాల్పుల్లో 7 మంది మృతి

Shooting In Philadelphia

Open Fire

ఇజ్రాయిల్ (Israel)లో విషాదం చోటుచేసుకుంది. జెరూసలేం ప్రార్థనా మందిరంలో ఓ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 7 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. షబ్బత్ ప్రార్థనల్లో పాల్గొనే ఇజ్రాయిలే లక్ష్యంగా పాలస్తీనా తీవ్రవాది కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత సదరు ఉగ్రవాది పారిపోవడానికి యత్నించగా, పోలీసులు అతడ్ని కాల్చిచంపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

జెరూసలేం పక్కనే ఉన్న యూదుల ఆలయంలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఓ ఉగ్రవాది కాల్పులు జరిపి 7 మందిని హతమార్చాడు. అనంతరం దాడి చేసిన వ్యక్తిని కూడా కాల్చిచంపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఇజ్రాయెల్ యొక్క అంబులెన్స్ సేవ మొదట్లో మరణించిన వారి సంఖ్యను ఐదుగా పేర్కొంది. మరో ఐదుగురు గాయపడ్డారని చెప్పారు, కానీ తరువాత సంఖ్యను పెంచింది. కాల్పుల అనంతరం 70 ఏళ్ల వృద్ధురాలు సహా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి చాలా విషమంగా ఉంది.

Also Read: Fire Breaks Out: సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

ఇది తీవ్రవాద దాడిగా అభివర్ణిస్తూ ఇజ్రాయెల్ పోలీసులు ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని యూదుల ప్రాంతమైన నెవ్ యాకోవ్‌లో జరిగిందని చెప్పారు. గాజాలోని హమాస్ ప్రతినిధి హజెమ్ కాసిమ్ మాట్లాడుతూ.. జెనిన్ ఆక్రమణకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ జరిగింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ దాడిని ప్రశంసించింది. కానీ దాడిని క్లెయిమ్ చేయలేదు. అదే సమయంలో ఈ దాడిని అమెరికా ఖండించింది.