Iran: ఇరాన్ యుద్ధం విస్తరిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మొదటిసారిగా ఇజ్రాయెల్ దాడులపై ఒక ‘లక్ష్మణ రేఖ’ను గీశారు. యుద్ధాన్ని ఆపడానికి అమెరికా షరతులను అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. ఇజ్రాయెల్ ఇకపై ఇరాన్లోని ‘సౌత్ పార్స్’ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేయబోదని స్పష్టం చేశారు. అమెరికా మిత్రదేశమైన ఖతార్లోని ‘రాస్ లఫాన్’ గ్యాస్ ప్లాంట్పై ఇరాన్ ఎదురుదాడి చేయడంతో ట్రంప్, అమెరికా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
ఒకేసారి 9 దేశాలపై ఇరాన్ దాడి
గ్యాస్ ఫీల్డ్పై జరిగిన దాడి గురించి అమెరికాకు ముందుగా సమాచారం లేదని ఇరాన్కు వివరించే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. అంతకుముందు ఇజ్రాయెల్, ఇరాన్లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ అయిన ‘సౌత్ పార్స్’పై దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గత రాత్రి ఒకేసారి 9 దేశాలపై దాడులు చేసి యుద్ధాన్ని ఊహించని మలుపు తిప్పింది. చమురు, గ్యాస్ ప్లాంట్లపై దాడులు మొదలవ్వడంతో అరబ్ దేశాలు, తమ మిత్రదేశాలపై దాడులు చేయవద్దని అమెరికా ఇప్పుడు ఇరాన్ను కోరే పరిస్థితి వచ్చింది.
Also Read: కోర్టుకు గౌతమ్ గంభీర్.. రూ. 2.5 కోట్ల నష్టపరిహారం డిమాండ్?!
‘ఆపరేషన్ మ్యాడ్మ్యాన్’
ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ‘ఆపరేషన్ మ్యాడ్మ్యాన్’ ప్రారంభించింది. ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్, ఇరాక్లను క్షిపణులు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంది. ఈ 9 దేశాలలో 7 దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాలు. ఇరాన్ చేసిన ఈ ఎదురుదాడి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. దీని ప్రభావంతో భారత షేర్ మార్కెట్తో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
ఈ కొత్త దాడుల వెనుక ఇరాన్ ఉద్దేశం ఏమిటి?
గతంలో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్లాంట్ అయిన ‘ఖర్గ్ ఐలాండ్’పై దాడి చేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ‘సౌత్ పార్స్’ గ్యాస్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంది. తమ చమురు, గ్యాస్ ప్లాంట్ల జోలికి రావద్దని ఇరాన్ ముందే హెచ్చరించినప్పటికీ దాడులు జరగడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అరబ్ దేశాల చమురు ప్లాంట్లపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్, అమెరికాపై ‘యుద్ధ విరమణ’ కోసం ఒత్తిడి తెస్తాయన్నదే ఇరాన్ ప్రధాన ఉద్దేశం.
