Site icon HashtagU Telugu

Travel advisory: భారతీయులు ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలకు వెళ్ళవద్దు

Travel advisory

Travel advisory

Travel advisory; ఇజ్రాయెల్ లేదా ఇరాన్‌కు వెళ్లాలనుకునే భారతీయులకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది . తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌కు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయులందరికీ సూచించింది. మిడిల్ ఈస్ట్‌లో మిలిటరీ తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు..

ప్రస్తుతం ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న వారందరూ అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తమ భద్రత గురించి చాలా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

We’re now on WhatsAppClick to Join

ఆరు నెలల యుద్ధానికి విరామం ఇవ్వాలనే లక్ష్యంతో కాల్పుల విరమణ చర్చలు సాగడంతో ఇరాన్ త్వరలో ఇజ్రాయెల్‌పై దాడి చేయవచ్చనే కారణంతో భారత్‌ను, ఫ్రాన్స్‌ను తమ పౌరులను ఈ ప్రాంతానికి వెళ్లవద్దని సిఫార్సు చేశాయి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన తర్వాత పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గత వారం సిరియా రాజధాని డమాస్కస్‌లో వైమానిక దాడిలో మరణించిన ఇద్దరు జనరల్‌ల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ బెదిరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లేదా ఇరాన్‌కు వెళ్లాలనుకునే భారతీయులు తమ పర్యటనలను వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది.

Also Read: Sri Ram Navami: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పోలీసుల కీలక సూచనలు