Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానికి విచిత్ర అనుభవం..!!

  • Written By:
  • Updated On - October 29, 2022 / 10:40 AM IST

బ్రిటన్ ప్రధాని రిషిసునక్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు సౌత్ లండన్ లోని క్రోయిడన్ హస్పిటల్ కు వెళ్లారు. ఓ రోగిని ఇక్కడి సిబ్బంది బాగా చూసుకుంటున్నారా అని అడిగారు. ఆ రోగి సమాధానం ఇస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ మీరు ఇచ్చే జీతాలు వారికి సరిపోవడం లేదు..వారిని చూస్తే జాలేస్తోంది అన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ను బలోపేతం చేయడంతోపాటు నర్సుల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని రిషిసునక్ ను ఆమె కోరారు.

ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని రిషిసునక్ చెప్పేలోపు ఆమె …మీరు మామూలుగా ప్రయత్నించడం కాదు…తీవ్రంగా ప్రయత్నించాలని అన్నారు. దీంతో రిషి సునక్ ఆశ్చర్యపోయారు. మీరు చెప్పిన మాటలు ఖచ్చితగా అమలు అయ్యోలా చూస్తాను. ఇక్కడ చాలామంది సిబ్బంది ఉన్నారు. అంటూ సమాధానం ఇచ్చారు. తమ జీతాలను పెంచాలంటూ ఈమధ్యే దాదాపు మూడు లక్షల మంది నర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకోవడంతోపాటుగా ఓటింగ్ కూడా నిర్వహించారు.