Brazil Former President: ఆస్పత్రిలో చేరిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు.. కారణమిదే..?

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు (Brazil Former President) జైర్‌ బోల్సోనారో కడుపునొప్పితో బాధపడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. బ్రెసిలియాలో అతని మద్దతుదారులు హింసకు పాల్పడిన ఒక రోజు తర్వాత అతను ఫ్లోరిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బోల్సోనారో భార్య చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Brazil Ex President

Resizeimagesize (1280 X 720) (1)

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు (Brazil Former President) జైర్‌ బోల్సోనారో కడుపునొప్పితో బాధపడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. బ్రెసిలియాలో అతని మద్దతుదారులు హింసకు పాల్పడిన ఒక రోజు తర్వాత అతను ఫ్లోరిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బోల్సోనారో భార్య చెప్పారు. బోల్సోనారో ఫ్లోరిడాలోని ఓర్లాండో వెలుపల ఉన్న అడ్వెంట్‌హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్‌లో చేరినట్లు బ్రెజిల్‌కు చెందిన ఓ గ్లోబో వార్తాపత్రిక తెలిపింది. జైర్ బోల్సోనారో భార్య మిచెల్ బోల్సోనారో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు. 2018లో జరిగిన దాడి కారణంగా బొల్సోనారో ఉదర అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నారు. అయితే బోల్సోనారో గురించి ఓర్లాండో హాస్పిటల్ మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

జైర్ బోల్సోనారో జనవరి 1న ఎన్నికలలో తనను ఓడించిన ప్రముఖ లెఫ్టిస్ట్ లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు అధ్యక్ష పదవి సాంప్రదాయ బదిలీని తిరస్కరించారు. అతను మాజీ బ్రెజిలియన్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ జోస్ ఆల్డో ఓర్లాండో ఇంటిలో నివసిస్తున్నాడు. ఇది డిస్నీ వరల్డ్ నుండి కొద్ది దూరంలో ఉంది. బ్రెజిల్ రాజధానిలోని అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీంకోర్టుపై మితవాద నిరసనకారులు దాడి చేసిన రోజున ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడి 2021 జనవరి 6న అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు US క్యాపిటల్‌పై జరిపిన దాడులను గుర్తు చేసింది.

కత్తి దాడి కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా అతను ఆసుపత్రిలో చేరినట్లు బోల్సోనారో భార్య చెప్పారు. 2018లో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ కత్తితో దాడి జరిగింది. ఆపై దాడి చేసిన వ్యక్తి అకస్మాత్తుగా అతని కడుపులో పొడిచాడు. అప్పటి నుండి అతనికి ఆరు శస్త్రచికిత్సలు జరిగాయి.

Also Read: 678 Houses Develop Cracks: జోషిమఠ్ లో 678 ఇళ్లకు ప‌గుళ్లు.. సహాయక చర్యలు ముమ్మరం

మరోవైపు.. బ్రెజిల్‌ రాజధాని బ్రజిలియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఆ దేశ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో భద్రతా వైఫల్యాలకు బాధ్యుడిని చేస్తూ బ్రజిలియా గవర్నర్‌పై వేటు వేసింది. 90 రోజులపాటు ఆయన్ను పదవి నుంచి తొలగించింది. ఇలాంటి మరిన్ని దేశవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకుగానూ తాజా ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని బ్లాక్‌ చేయాలని ఫేస్‌బుక్, ట్విటర్‌, టిక్‌టాక్‌లను ఆదేశించింది.

  Last Updated: 10 Jan 2023, 08:33 AM IST