నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం (Boat Capsizes) సంభవించింది. వాయువ్య సోకోటో రాష్ట్రంలోని గోరోన్యో మార్కెట్కు వెళ్తున్న ఒక పడవ బోల్తా పడి దాదాపు 40 మంది నదిలో గల్లంతయ్యారు. ఈ ప్రమాద సమయంలో పడవలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 10 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. గల్లంతైన వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Condor Airlines plane: గాల్లోనే కాండోర్ ఎయిర్లైన్స్ విమానానికి మంటలు..అత్యవసర ల్యాండింగ్
మూడు వారాల క్రితం కూడా నైజీరియాలో ఇలాంటి ప్రమాదం జరిగింది. ఉత్తర-మధ్య నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు, ఇంకా పలువురి ఆచూకీ తెలియలేదు. నైజీరియాలో పడవ ప్రయాణం చాలా సాధారణం, ముఖ్యంగా వర్షాకాలంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పాత పడవలు, అధిక లోడింగ్, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటివి అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.