Pakistan : ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ లో ప్రమాదం..మహిళా జర్నలిస్టు మృతి..!!

  • Written By:
  • Publish Date - October 30, 2022 / 09:39 PM IST

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా జర్నలిస్టు కంటైనర్ కింద పడి మరణించింది. మరణించిన జర్నలిస్టు ఛానెల్ 5 రిపోర్టర్ సదాఫ్ నయిమ్ గా గర్తించింది పాక్ స్థానిక మీడియా. లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన ఈ విషాద సంఘటన తర్వాత పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నాల్గవ రోజు కామోకే నుంచి లాంగ్ మార్చ్ ప్రారంభం అవుతుందని పీటీఐ తెలిపింది.