California: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు కిడ్నాప్,హత్య, మృతుల్లో 8 నెలల చిన్నారి..!!

అమెరికాలో విషాదం నెలకొంది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన నలుగురిని కిడ్నాప్ చేసిన దుండగులు వారిని దారుణంగా హత్య చేశారు.

  • Written By:
  • Publish Date - October 6, 2022 / 10:51 AM IST

అమెరికాలో విషాదం నెలకొంది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన నలుగురిని కిడ్నాప్ చేసిన దుండగులు వారిని దారుణంగా హత్య చేశారు. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఈనెల 3న సౌత్ హైవే 59లోని 800 బ్లాక్ నుంచి నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసినట్లు అధికారులు తెలిపారు.

కిడ్నాప్ కు గురైన బాధిత కుటుంబం పంజాబ్ లోని హోషియాపూర్ జిల్లా తాండాలోని హర్సీ గ్రామం వాసులుగా తెలిపారు. 36 ఏళ్ల జస్దీప్ సింగ్, అతని భార్య జస్లీన్ కౌర్ 27 వారి 8నెలల కుమార్తె అరుహీ ధేరి, 39 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నారు. వీరికి అమెరికాలో ట్రాన్స్ పోర్టు బిజినెస్ ఉంది. సోమవారం తెల్లవారుజామున కాలిఫోర్నియా అగ్నిమాపక అధికారులు అమన్ దీప్ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాపర్లు ట్రక్కుకు నిప్పు పెట్టి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న 48ఏళ్ల వ్యక్తి కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.