7 Killed : తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు.. రెండు ఇళ్లలో కాల్పులు.. ఏడుగురి మృతి

7 Killed : అమెరికాలో మరోసారి గన్ పేలింది.  చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు(7 Killed) చనిపోయారు.

  • Written By:
  • Updated On - January 23, 2024 / 08:06 AM IST

7 Killed : అమెరికాలో మరోసారి గన్ పేలింది.  చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు(7 Killed) చనిపోయారు. జోలియట్‌ ఏరియాలోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లోని 2200 బ్లాక్‌లో ఈ  కాల్పులు జరిగాయి. 23 ఏళ్ల రోమియో నాన్స్‌ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. అతడు పరారీలో ఉన్నాడు.ఈవివరాలను ఇల్లినాయిస్‌లోని జోలియట్‌లో ఉన్న పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ ధ్రువీకరించారు. రోమియో నాన్స్‌  కూడా అదే ఏరియాలో నివసించేవాడని.. ఆ రెండు ఇళ్లలోని వారితో గతంలో జరిగిన ఏదైనా గొడవకు ప్రతీకారంగా కాల్పులు జరిపి ఉంటాడని అంచనా వేస్తున్నారు.ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో అతడు పారిపోయాడని పరిసర ప్రాంత ప్రజలు తెలిపారు. ఆ కారు ఫొటోను పోలీసులు రిలీజ్ చేశారు. దాన్ని ఎవరైనా చూసి ఉంటే తమకు తెలియజేయాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

అమెరికాలో గన్ కల్చర్‌కు భారతీయులు బాధితులుగా మారుతున్నారు. ప్రత్యేకించి భారతీయ విద్యార్థులను దుండగులు లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన పాలకొండకు చెందిన ఓ విద్యార్థి విగతజీవిగా సొంతూరుకు శనివారం చేరాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో పాలకొండ శోకసంద్రమైంది. చదువే లోకంగా జీవించిన ఆ విద్యార్థి కలలు కల్లలయ్యాయి. తమ బిడ్డపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పాలకొండలోని బట్టి మఠం కాలనీలో రాకోటి వెంకటరమణ, ఆదిలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాకోటి సాయినికేష్‌(21), కుమార్తె లేఖ ఉన్నారు. సాయినికేష్‌ ఇటీవల ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఎంఎస్‌ కోసం గత నెల డిసెంబర్‌ ఆఖరులో అమెరికా వెళ్లాడు.

Also Read: AP Voters List : 5.64 లక్షల ఓట్లు ఔట్.. కొత్త ఓటర్లు 8.13 లక్షల మంది

హర్ట్‌పోర్టు సిటీలో సీక్రెడ్‌ యూనివర్సిటీలో సీటు రావడంతో అక్కడ ఎంఎస్‌లో చేరాడు. అమెరికా వెళ్లిన 15 రోజుల్లోనే ఈ నెల 12న శుక్రవారం తాను ఉంటున్న గదిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు.సాయినికేష్‌తో పాటు అదే గదిలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన మరో తెలుగు విద్యార్థి కూడా మృతి చెందాడు. విష వాయువు పీల్చడంతోనే వీరిద్దరు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శనివారం సాయినికేష్‌ మృతదేహం ఇక్కడకు రాగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డ మృతికి పూర్తి కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయినికేష్‌ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన సహచర విద్యార్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో పాలకొండ పట్టణంలో విషాదం అలముకుంది.