Suicide Blast: పాకిస్థాన్‌ సైనికులపై ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఆత్మాహుతి పేలుడు సంభవించింది. దాడి చేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన మోటార్‌సైకిల్‌తో పాకిస్తాన్ భద్రతా దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు

Suicide Blast: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఆత్మాహుతి పేలుడు సంభవించింది. దాడి చేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన మోటార్‌సైకిల్‌తో పాకిస్తాన్ భద్రతా దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య పాకిస్థాన్‌లోని గిరిజన జిల్లాలో ఈ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని డిఐ ఖాన్ నుండి దక్షిణ వజీరిస్థాన్‌లోని అస్మాన్ మాంజా ప్రాంతానికి భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి దాడి చేసినట్లు బిడిఎస్ (బాంబు నిర్వీర్యం స్క్వాడ్) ఇన్‌ఛార్జ్ ఇనాయతుల్లా టైగర్ తెలిపారు. భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు సభ్యుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దాడి తర్వాత మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టామని, దాడిపై పాకిస్తాన్ లా-ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయని బాంబు నిర్వీర్య స్క్వాడ్ ఇన్‌ఛార్జ్ చెప్పారు. అయితే ఈ దాడికి బాధ్యులమని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లోని దత్తా స్పోర్ట్స్ మార్కెట్‌లోని భద్రతా తనిఖీ కేంద్రం వద్ద పేలుడు పదార్థాలతో నిండిన కారును ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి ఢీకొట్టడంతో ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

Read More: Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పింక్ బేబీ