Site icon HashtagU Telugu

Pakistan: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి, 63 మందికి గాయాలు

Mexico Bus Crash

Road accident

పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం పాకిస్థాన్‌లోని చక్వాల్ రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు కాలువలో పడింది. బస్సు కాలువలో పడి 14 మంది చనిపోగా, 63 మంది గాయపడినట్లు సమాచారం. టైరు పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైరు పగిలిపోవడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు కాలువలో పడిపోయింది.

టైర్ పేలడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని ARY న్యూస్‌ ధృవీకరించింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అందిన సమాచారం ప్రకారం.. బస్సు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వెళుతోంది. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బస్సు ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లు సమాచారం. కల్లార్ కహర్‌లోని ఉప్పు శ్రేణి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళల్లో కనుచూపు తక్కువగా ఉండడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్‌కు బస్సులో నుంచి ప్రజలను బయటకు తీసుకురావడం కష్టమైంది. అయితే పోలీసులు, రెస్క్యూ టీమ్ తమ పనిని కొనసాగించారు.

Also Read: Tiger Died: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. వండుకుని తినేసిన వైనం!

గత వారం నవాబ్‌షాలో వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొని పికప్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాసింజర్ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం తర్వాత పోలీసులు రోడ్డును మూసేయాల్సి వచ్చింది.

Exit mobile version