Site icon HashtagU Telugu

Uttar Pradesh: వీడియో కాల్‌లో భర్త ఎదుటే వివాహిత ఆత్మహత్య

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: భర్త ఎదుటే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, భర్త నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో వెలుగు చూసింది. రోజూ లాగానే డిన్నర్ చేశాక భార్య తన గదికి వచ్చి ముంబైలో ఉద్యోగం చేస్తున్న భర్తకు వీడియో కాల్ చేసింది. భార్యాభర్తలిద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా.. ఏదో సమస్యపై భార్య కోపంతో దుపట్టాతో ఉరేసుకుని భర్త ఎదుటే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన మొత్తాన్ని భర్త వీడియో కాల్‌లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు, కాని అతను తన భార్యను రక్షించలేకపోయాడు. ఘటన జరిగిన సమయంలో ఆ గదిలో చిన్నారి కూడా ఉంది. ఉరివేసుకున్న తల్లిని చూసి కేకలు వేస్తున్న ఆ చిన్నారి బాధ వర్ణనాతీతం.

గదిలో నుంచి చాలా సేపటికి చిన్నారి అరుపు శబ్ధం వినిపించడంతో మిగిలిన కుటుంబ సభ్యులు గదిలోకి వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతున్న వివాహితను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివాహిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

నాలుగు సంవత్సరాల క్రితం కర్దా గ్రామానికి చెందిన రమేష్ కుమార్తె మీరాతో రామచంద్రాహి గ్రామానికి చెందిన అర్జున్ పెద్ద కుమారుడు మిట్టుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మీరా తన అత్తమామలతో కలిసి జీవిస్తుంది అత్తగారు, మామగారు ఇద్దరూ మానసిక అనారోగ్యంతో ఉన్నారు. భర్త ముంబైలో పనిచేస్తుండగా, బావ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. మీరా తరచూ తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడేది. రోజూలాగే శనివారం కూడా రాత్రి భోజనం చేసిన తర్వాత భర్తకు వీడియో కాల్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో మీరా తీవ్ర ఆగ్రహానికి గురై ఉరి వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఈ ఘటన తర్వాత భర్తతో సహా కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. అదే సమయంలో ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Amarnath Leaves: తోటకూర తింటే నిజంగానే షుగర్ కంట్రోల్ అవుతుందా?