Safari World Zoo : జూ కీపర్ ను పీక్కు తిన్న సింహాలు

Safari World Zoo : జూ కీపర్‌గా విధులు నిర్వహిస్తున్న 58 ఏళ్ల జియాన్ రంగఖారసమీ (Zookeeper Jian Rangkasamee) అనే వ్యక్తిని సింహాలు పీక్కుతిన్నాయి

Published By: HashtagU Telugu Desk
Lions Maul Zookeeper To Dea

Lions Maul Zookeeper To Dea

బ్యాంకాక్‌లోని సఫారీ వరల్డ్ జూలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జూ కీపర్‌గా విధులు నిర్వహిస్తున్న 58 ఏళ్ల జియాన్ రంగఖారసమీ (Zookeeper Jian Rangkasamee) అనే వ్యక్తిని సింహాలు పీక్కుతిన్నాయి. ఈ భయానక ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు చూసి షాక్‌కు గురయ్యారు. వారు సింహాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, 15 నిమిషాల పాటు సింహాలు అతడిని వదల్లేదని బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక వెల్లడించింది. ఈ ఘటన తర్వాత అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే జియాన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!

ఈ దుర్ఘటనకు కారణం జూ కీపర్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు తెలిపారు. జంతువులకు ఆహారం వేసే సమయంలో లేదా వాటి దగ్గరకు వెళ్ళేటప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలు చాలా కఠినంగా ఉంటాయని, వాటిని పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. ఈ విషాదకరమైన ఘటన జూ సిబ్బందిలో తీవ్ర ఆందోళన కలిగించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా జూల యాజమాన్యాలు మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. జూ కీపర్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

  Last Updated: 11 Sep 2025, 07:40 PM IST