Rahul : ప్ర‌తి ప‌రిశ్ర‌మలో అదానీయే ఎందుకు క‌నిపిస్తున్నారు? : రాహుల్ గాంధీ

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 08:02 PM IST

Rahul Gandhi : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీPrime Minister Narendra Modi) పారిశ్రామికవేత్త‌ అదానీ(Adani)కే అన్ని ప్ర‌యోజ‌నాల‌ను క‌ట్ట‌బెడుతున్నార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తాను ఈ విష‌యం పార్ల‌మెంట్(Parliament) వేదిక‌గా చెబితే త‌న స‌భ్య‌త్వాన్ని తీసివేశార‌ని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను తిరిగి ఎంపీ ప‌దవి చేప‌ట్టాన‌ని రాహుల్ అన్నారు.

రాజ‌స్ధాన్‌(Rajasthan)లోని జోథ్‌పూర్‌(Jodhpur)లో గురువారం జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌ధాని మోడీ, కాషాయ పార్టీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌తి ప‌రిశ్ర‌మలో అదానీయే ఎందుకు క‌నిపిస్తున్నార‌ని తాను అడిగాన‌ని, అదానీతో మీకెలాంటి సంబంధం ఉంద‌ని ప్ర‌ధానిని ప్ర‌శ్నించాన‌ని చెప్పారు. కాషాయ పాల‌కులు ప్ర‌తిగా త‌న పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసి త‌న ఇంటిని లాగేసుకున్నార‌ని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వారు నా ఇంటిని తీసుకుంటే నేను మౌనంగా ఉంటాన‌ని వారనుకున్నార‌ని చెప్పారు. ఇంటి తాళాల‌ను వారికి అప్ప‌గించి మీ ఇల్లు నాకు అవ‌స‌రం లేద‌ని, నాకు దేశంలో కోట్లాది ఇండ్లున్నాయ‌ని, కోట్ల మంది ప్ర‌జ‌ల హృదయాల్లో నివ‌సిస్తాన‌ని వారికి చెప్పాన‌ని రాహుల్ వివ‌రించారు. కొద్ది మంది బ‌డా సంప‌న్న పారిశ్రామిక‌వేత్త‌ల బాగు కోస‌మే మోడీ ప‌నిచేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Read Also: Summer: సమ్మర్ ఎఫెక్ట్..  సిటీలో పెరుగుతున్న విద్యుత్ వాడకం