What Is Sky Bus : ఇప్పుడు మన దేశంలో స్కై బస్ సర్వీసు గురించి మరోసారి చర్చ మొదలైంది. తొలి విడతగా ఢిల్లీ – గురుగ్రామ్ మధ్య స్కై బస్ సర్వీసును ప్రారంభించాలని కేంద్ర సర్కారు యోచిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల మెట్రో రూట్లలో, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలో స్కై బస్ సర్వీసు అంటే ఏమిటి ? అదెలా పని చేస్తుంది? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
We’re now on WhatsApp. Click to Join.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా రూ.100 కోట్లతో గోవాకు స్కై బస్ ప్రాజెక్టును ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా మపుసా నుంచి పనాజీ వరకు స్కై బస్ సర్వీసు ట్రాక్ ను నిర్మించారు. అయితే 2016లో అకస్మాత్తుగా కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ను రద్దు చేసింది. స్కైబస్ సర్వీసుల ప్రాజెక్టు అంత లాభదాయకంగా ఉండకపోవచ్చనే కారణంతో రైల్వే శాఖ ఆ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇప్పుడు ఆ దిశగా ప్రతిపాదనలు తెరపైకి రావడం గమనార్హం. ఇప్పుడు ఇండియా చాలా మారింది. ప్రజలు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను కోరుకుంటున్నారు. ఖర్చు ఎక్కువైనా ప్రయాణించేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందువల్లే ఇండియాలో మెట్రో రైళ్లు, వందే భారత్ వంటివి సక్సెస్ అయ్యాయి. స్కై బస్ సర్వీసులు కూడా సక్సెస్ అవుతాయనే ఆశాభావంతో ఇప్పుడు మళ్లీ ఇండియా వాటి వైపు(What Is Sky Bus) అడుగులు వేస్తోంది.