India-US: భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైంది: ట్రంప్‌

ఒప్పందం కుదిరే దశకు చాలా దగ్గరగా వచ్చాము అని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్‌ అధికార కాలంలో న్యూఢిల్లీపై దాదాపు 26 శాతం దిగుమతి సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సుంకాలపై ఓ పరిష్కారానికి రాకుండా, ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Elon Musk- Trump

Elon Musk- Trump

India-US: భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. త్వరలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ భారత్‌తో మేము టారిఫ్‌లపై చర్చలు ఎంతో విజయవంతంగా జరుపుతున్నాం. ఒప్పందం కుదిరే దశకు చాలా దగ్గరగా వచ్చాము అని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్‌ అధికార కాలంలో న్యూఢిల్లీపై దాదాపు 26 శాతం దిగుమతి సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సుంకాలపై ఓ పరిష్కారానికి రాకుండా, ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సుంకాలపై సవరణలు చేయాలనే ఉద్దేశంతో రెండు దేశాలు ముందడుగు వేస్తున్నాయి.

Read Also: Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు

ఇదే సందర్భంలో, పాకిస్థాన్‌ గురించేనూ ట్రంప్‌ స్పందించారు. భారత్‌-పాక్‌లు ఘర్షణకు దిగిన పక్షంలో, ఆ దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తి తనకు ఉండదని స్పష్టం చేశారు. వాణిజ్య చర్చల నిమిత్తం పాకిస్థాన్‌ ప్రతినిధులు వచ్చే వారం వాషింగ్టన్‌ కు రానున్నారని ఆయన తెలిపారు. ఇతీరుగా, భారత్‌, అమెరికాల మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌తో సమావేశమయ్యారు. సెప్టెంబరు లేదా అక్టోబరు నాటికి మొదటి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలన్నది ఇరుదేశాల లక్ష్యం.

ఈ చర్చలలో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ మినహాయింపుల పరిమితులపై సుస్థిర నిర్ణయాలకు రాగల అవకాశాలున్నాయి. అమెరికా ఇప్పటికే ఏప్రిల్‌లో పలు దేశాలపై అధిక దిగుమతి సుంకాలను విధించింది. అయితే, వాటిపై 90 రోజుల సడలింపును ప్రకటించింది. చాలా దేశాలు ఈ చర్యలకు ప్రతీకారంగా స్పందించినా, భారత్‌ మాత్రం వ్యూహాత్మకంగా స్పందించింది. ప్రతికార చర్యలకు వెనుకాడుతూ, అమెరికాతో బలమైన వాణిజ్య ఒప్పందం సాధించాలన్న దిశగా అడుగులు వేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో ఈ ఒప్పందానికి గట్టి పునాది పడింది. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని, ఆర్థిక సంబంధాలను మరింత బలపరచేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థుతుల మధ్య, ఈ ఒప్పందం రెండు దేశాలకు మేలు చేసేందుకు మార్గం చూపే అవకాశముంది.

Read Also: Miss World 2025: నేడే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు.. జడ్జిలు ఎవరంటే?

  Last Updated: 31 May 2025, 01:17 PM IST