Humanity: కోటి రూపాయ‌ల ఆస్తిని రిక్షా పుల్ల‌ర్ కి ఇచ్చేసిన మ‌హిళ‌…!

త‌న కుటుంబానికి రెండు ద‌శాబ్దాలుగా సేవ చేస్తున్న వ్య‌క్తికి ఓ మ‌హిళ త‌న ఆస్తుల్ని విరాళంగా రాసి ఇచ్చింది. ఈ సంఘ‌ట‌న ఒడిశాలోని కటక్ లో జ‌రిగింది.

  • Written By:
  • Updated On - November 15, 2021 / 10:57 PM IST

త‌న కుటుంబానికి రెండు ద‌శాబ్దాలుగా సేవ చేస్తున్న వ్య‌క్తికి ఓ మ‌హిళ త‌న ఆస్తుల్ని విరాళంగా రాసి ఇచ్చింది. ఈ సంఘ‌ట‌న ఒడిశాలోని కటక్ లో జ‌రిగింది. సుతాహ‌త్ కు చెందిన 63 ఏళ్ల మినాటి ప‌ట్నాయ‌క్ త‌న‌కు ఉన్న మూడంస్తుల ఇల్లు, బంగారు ఆభ‌ర‌ణాలు, ఆస్తుల‌న్నింటిని రిక్షా పుల్ల‌ర్ బుధ స‌మ‌ల్ కు విరాళంగా ఇచ్చారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయ‌లుకు పైగానే ఉంటుంది. తన కుటుంబానికి 25 సంవత్సరాల సేవకు గుర్తింపుగా ఈ ఆస్తిని ఇచ్చిన‌ట్లు ఆమె తెలిపారు.

గత ఏడాది కిడ్నీ ఫెయిల్యూర్‌తో మినాటి ప‌ట్నాయ‌క్ త‌న భర్తను కోల్పోయింది. ఇటీవల కార్డియాక్ అరెస్ట్ తో త‌న కుమార్తె కోమ‌ల్ మ‌ర‌ణించింది. మినాటీ ఆమె భర్తకు 25 సంవత్సరాలు సేవ చేసిన పేద రిక్షా పుల్లర్ కుటుంబానికి తన ఆస్తి మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని మినాటి భావించింది. క్రమ వ్యవధిలో త‌న‌ భర్త, కుమార్తె మరణించిన తరువాత తాను కృంగిపోయి దుఃఖంలో ఉన్నాన‌ని మినాటి అన్నారు. వీరిద్ద‌రు చ‌నిపోయిన త‌రువాత త‌న బంధువులెవరూ త‌న‌ను ఆదుకోలేదని… తాను పూర్తిగా ఒంటరిగా ఉన్నానని తెలిపింది. అయితే ఈ రిక్షా పుల్లర్ కుటుంబం కష్ట సమయాల్లో త‌న‌కు అండగా నిలిచింద‌ని ఆమె తెలిపింది. ఏ ప్రతిఫలం ఆశించకుండా త‌న‌ ఆరోగ్యాన్ని చూసుకున్నార‌ని ఆమె పేర్కొన్నారు.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

త‌న‌ మరణానంతరం వారిని ఎవరూ వేధించకుండా ఉండేందుకు బుధ స‌మ‌ల్అ, తని కుటుంబానికి చట్టబద్ధంగా ప్రతిదీ విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాన‌ని ఆమె తెలిపింది. రిక్షా పుల్ల‌ర్ త‌న కూతుర్ని రావెన్ షా కాలేజీకి తీసుకెళ్లేవాడని…అతనిపై త‌న‌కు ఉన్న నమ్మకం మరియు త‌న‌ కుటుంబం పట్ల ఆయనకున్న అంకితభావం అతనికి ఈ ప్రతిఫలాన్ని సంపాదించిపెట్టాయన్నారు. త‌న‌ ఆస్తిని వారికి ఇవ్వడం ద్వారా తాను వారికి గొప్ప సేవ ఏమీ చేయలేదని దానికి వారు అర్హులు అని ఆమె తెలిపింది.

అయితే మినాటి ప‌ట్నాయ‌క్ ముగ్గురు సోదరీమణులలో ఇద్దరు ఆమె ఆస్తిని రిక్షా పుల్లర్, ఆమె కుటుంబానికి ఇవ్వాలనే ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ మినాటి మాత్రం త‌న‌ ప్రణాళికను అమలు చేయడానికి నిశ్చయించుకుంది. ఆమె మరణం తర్వాత తన ఆస్తిని సక్రమంగా బదిలీ చేసేలా అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించింది. రిక్షా పుల్ల‌ర్ బుధ స‌మ‌ల్ కు తల్లిదండ్రులతో పాటు, భార్య, ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.

Also Read : ప్రమాదం లో గజరాజులు!

మినాటి ప‌ట్నాయ‌క్‌ తన ఆస్తికి సంబంధించిన నిర్ణయం గురించి చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని బుధ స‌మ‌ల్ తెలిపారు. తాను రెండు దశాబ్దాలకు పైగా ఈ కుటుంబానికి సేవ చేస్తున్నాన‌ని…త‌న మ‌ర‌ణం వ‌ర‌కు మినాటికి సేవ చేస్తూనే ఉంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న‌ కుటుంబ జీవితాలపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన నిర్ణయం మినాటీ తీసుకున్నందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని బుధ సమల్ చెప్పారు. రిక్షా లాగే ఉద్యోగం మానేసి మినాటి కోరిక మేరకు నాలుగు నెలల క్రితం తన భార్య, పిల్లలతో కలిసి మినాటి ఇంటికి వెళ్లామ‌ని ఆయ‌న తెలిపారు. మేము ఎప్పటినుంచో మినాతిని మా స్వంత తల్లిగా భావించామని బుధ స‌మ‌ల్ భార్య అన్నారు. త‌మ కుటుంబం అంతా ఆమె వద్దే ఉన్నామని తెలిపారు.