Arvind Kejriwal: అవినీతి ఆరోపణలపై గత నెలలో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించాలని చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ విమర్శంచింది. వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ సమర్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి వాదనలు శుక్రవారం వింటామని తెలిపింది. మరోవైపు ఈడీ వాదనను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ కొట్టిపారేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే, ముఖ్యమంత్రి డైట్ చార్ట్లోని అన్ని ఆహార పదార్థాలను ఆయన డాక్టర్ సూచించారని కేజ్రీవాల్ న్యాయ బృందం నొక్కి చెప్పింది. ఇంట్లో వండిన ఆహారాన్ని సరఫరా చేయకుండా ఆపడానికి ED సాకులు చెబుతోందని అతని తరపు న్యాయవాది ఆరోపించారు. AAP నాయకుడి మధుమేహం దృష్ట్యా కోర్టు అనుమతినిచ్చింది.
కాగా, అవినీతి ఆరోపణలపై తీవ్రమైన న్యాయ పోరాటాలతో పాటు కేజ్రీవాల్ ఆరోగ్యంపై కూడా పోరాడుతున్నారు. కేజ్రీవాల్ను తీహార్ జైలుకు పంపిన తర్వాత అతను 4.5 కిలోల బరువు తగ్గాడని ఆప్ పేర్కొంది.
మరోవైపు కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఒక్కసారిగా 46 ఎంజికి పడిపోయిందని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఇది”చాలా ప్రమాదకరం” అని వైద్యులు తనకు సలహా ఇచ్చారని అతిషి చెప్పారు.