Site icon HashtagU Telugu

Telangana : మళ్లీ కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ..!

Harish Rao meets KCR again.. Discussion on Kaleshwaram Commission notices..!

Harish Rao meets KCR again.. Discussion on Kaleshwaram Commission notices..!

Telangana:  మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీ పలు రాజకీయ సంకేతాలు పంపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్‌ హరీశ్ రావుతో పాటు ఇతర అనేక నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ ఇటీవల ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతోంది. ఇందులో కీలక పాత్ర పోషించిన హరీశ్ రావుకు సంబంధించి వివిధ అంశాలపై స్పష్టత కోరుతూ కమిషన్ నోటీసులు పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కేసీఆర్‌తో భేటీలో హరీశ్ రావు తన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.

Read Also: TDP Mahanadu : నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

విచారణకు సంబంధించి తదుపరి చర్యలు, న్యాయపరమైన అవకాశాలు, పార్టీ స్థాయిలో మద్దతు వంటి అంశాలపై రెండు గంటలపాటు చర్చ జరిగినట్లు చెబుతున్నారు. కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ అనేది కేవలం నోటీసులపై చర్చకే పరిమితమైందా లేక పార్టీ లోపల కొత్త పరిణామాలకు నాంది పలుకుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హవా పెరుగుతున్న నేపథ్యంలో భారాస బలహీనపడుతుండగా, కొత్త నాయకత్వంపై చర్చలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు భవిష్యత్తు రాజకీయ పాత్ర, పార్టీ నేతగా తన భద్రతపై కూడా కేసీఆర్‌తో చర్చించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గత కొంతకాలంగా హరీశ్ రావు, కేసీఆర్ మధ్య కొంతంత విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో హరీశ్‌కు పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంచినట్లయిందన్న వాదనలు వినిపించాయి.

కానీ, తాజాగా జరిగిన ఈ భేటీ ఆ ఉహాగానాలను కొంతవరకూ తిప్పికొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ రాజకీయ సమీకరణాలపై పునరాలోచన చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా ఈ భేటీ గురించి బీఆర్‌ఎస్‌ వర్గాలు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ పార్టీ పునర్నిర్మాణ దిశగా, వచ్చే ఎన్నికల వ్యూహాలు, న్యాయపరమైన అంశాల్లో పరస్పర సహకారానికి ఇది నాంది కావచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాలు పరిశీలించినట్లయితే, ఈ భేటీ కేవలం ఒక భేటీగా మిగిలిపోయే అవకాశం లేదు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరుగుతుందనే సంకేతాలు ఈ భేటీ ద్వారా అందుతున్నాయి.

Read Also:  High Court CJ : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేశ్‌‌ కుమార్‌ సింగ్‌.. మరో 3 హైకోర్టులకూ..