Elephant Crossing:వేగంగా దూసుకొస్తున్న రైలు..పట్టాలు దాటుతున్న ఏనుగు..వీడియో వైరల్..!!

రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇంతలో సడెన్ గా ఒక ఏనుగు పట్టాలపైకి దూసుకువచ్చింది.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 10:04 AM IST

రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇంతలో సడెన్ గా ఒక ఏనుగు పట్టాలపైకి దూసుకువచ్చింది. ఏనుగును లోకో పైలెట్ చూశాడు.చూస్తుండగానే రైలు బాగా దగ్గరకు వచ్చింది. ఇంకా ఆ ఏనుగు ట్రాకును దాటడం పూర్తి కాలేదు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్లు ఆర్ ఆర్ కుమార్, ఎస్ కుందుల సకాలంలో స్పందించారు. అత్యవసర బ్రేకులు వేసారు. దీంతో ఏనుగుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా భయటపడింది.

ఈ ఘటన ఉత్తర బెంగాల్లో జరిగింది. ఈ వీడియోను ఉత్తర బెంగాల్ కు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు లోకో పైలెట్లను ప్రశంసిస్తున్నారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుల్మా సివోక్ మధ్య 23/1వద్ద ట్రాక్ ను దాటుతున్న ఏనుగు ఆకస్మాత్తుగా గమనించి…రైలు వేగాన్ని నియంత్రించడానికి బ్రేకులు వేసి..వన్యప్రాణాలను రక్షించాం అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.