Site icon HashtagU Telugu

Patanjali : ప్రకటనల ప్రచారాన్ని ఆపండి.. పతంజలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Delhi High Court orders Patanjali to stop advertising campaign

Delhi High Court orders Patanjali to stop advertising campaign

Patanjali: ప్రముఖ ఆయుర్వేద కంపెనీల మధ్య ప్రచార యుద్ధం న్యాయస్థానంలోకి వెళ్ళింది. డాబర్ చ్యవన్‌ప్రాశ్‌ను లక్ష్యంగా చేసుకొని విడుదలైన పతంజలి వాణిజ్య ప్రకటనలపై డిల్లీ హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటనల ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని జస్టిస్ మణి పుష్కర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. పతంజలి సంస్థ ఇటీవల విడుదల చేసిన కొన్ని ప్రకటనల్లో, ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తాము మాత్రమే నిజమైన చ్యవన్‌ప్రాశ్ తయారుచేస్తున్నామనే మాటలు పేర్కొన్నది. అంతేకాదు, ఇతర సంస్థలు సరైన పరిజ్ఞానముండకుండా ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని కూడా ఆరోపించింది. ఇది డాబర్ కంపెనీ పరువు తీశారని పేర్కొంటూ, వారు హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: AP Assembly Elections : పోలింగ్ శాతంపై ఈసీని కలిసిన వైసీపీ బృందం

డాబర్ అభిప్రాయం ప్రకారం, తమ ఉత్పత్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, పతంజలి ప్రచారం చేయడం వాణిజ్య నైతికతలకు విరుద్ధంగా ఉంది. ఈ ప్రకటనలు తమ బ్రాండ్‌కు హాని కలిగిస్తున్నాయని పేర్కొంటూ, డబ్బు నష్టానికి న్యాయ పరిరక్షణ కావాలంటూ రూ.2 కోట్ల నష్టపరిహారం కూడా డాబర్ కోరిక వేసింది. ఇకపై, ఈ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని, తాము తయారుచేస్తున్న ఉత్పత్తే శ్రేష్ఠమని దుష్ప్రచారం చేయడం అనైతికమని డాబర్ వాదించింది. హైకోర్టు ప్రాథమికంగా డాబర్ వాదనను పరిగణలోకి తీసుకొని, ప్రకటనలపై తాత్కాలికంగా స్టే విధించింది. ఈ అంశంపై తదుపరి విచారణను జులై 14న నిర్వహించనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా కరోనా చికిత్స పేరుతో పతంజలి చేసిన తప్పుడు ఆరోగ్య ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అప్పట్లో పతంజలి మీద కోర్టులో కేసు వేశి, సంస్థ ప్రచారాన్ని తప్పుబట్టింది. పతంజలి తరచూ తమ ఉత్పత్తులను Ayurvedic Science ఆధారంగా అత్యుత్తమంగా ప్రాచుర్యం చేస్తూ, ఇతర సంస్థలను నెగటివ్‌గా చూపించే విధంగా ప్రకటనలు ఇస్తోంది. అయితే డాబర్ వంటి పాతాయితి సంస్థలు ఈ తీరుకు వ్యతిరేకంగా న్యాయపరంగా పోరాటం మొదలుపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయుర్వేద మార్కెట్లో ప్రమాణాల పరిరక్షణ, ప్రకటనల నైతికత అనే అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. బ్రాండ్ల మధ్య పోటీ పటిష్టంగా మారుతున్న ఈ కాలంలో, వాస్తవ ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు సంస్థల న్యాయస్థానాల తలుపులు తట్టేలా చేస్తున్నాయి. డాబర్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నదిపై ఆసక్తి నెలకొంది. ఆయుర్వేద రంగంలో ఈ తీర్పు ఒక దిశానిర్దేశకంగా మారే అవకాశముంది.

Read Also: MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత