కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.75 కాయిన్ ను(Rs 75 Coin) ఈనెల 28న (ఆదివారం) విడుదల చేయబోతోంది. ఈవిషయాన్నికేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నసందర్భంగా రూ.75 కాయిన్ ను(Rs 75 Coin) విడుదల చేస్తున్నామని తెలిపింది. ఈ కాయిన్ లో ఒక వైపు అశోక స్తంభం ఉంటుంది. దాని కింద "సత్యమేవ జయతే" అని రాసి ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో "భారత్" అని .. కుడి వైపున ఆంగ్లంలో "భారత్" అని రాసి ఉంటుంది. 75 అనే డినామినేషన్ విలువ కూడా కాయిన్ పై ఉంటుంది. Also read : New Parliament : ఉదయం 7.30 టు మధ్యాహ్నం 2.30.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఇలా రూ.75 నాణేనికి రెండో వైపు మన కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ ఫోటో ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో "సంసద్ సంకుల్", దిగువ అంచున ఆంగ్లంలో "పార్లమెంట్ కాంప్లెక్స్" అనే పదాలు ఉంటాయి. రూ.75 కాయిన్ 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 సెరేషన్లను కలిగి ఉంటుంది. 35 గ్రాముల బరువు ఉండే ఈ కాయిన్ నాలుగు లోహాల మిశ్రమంతో తయారైంది. ఇందులో 50% వెండి, 40% రాగి, 5% నికెల్ మరియు 5% జింక్ ఉంటాయి.