Site icon HashtagU Telugu

Billionaire To Zero : బిలియనీర్ జీరో అయ్యాడు.. బైజూస్ అధినేత నెట్ వర్త్ ‘జీరో’ !

Loss-Making Companies

ED Raids on Byjus CEO Ravindran office and house

Billionaire To Zero : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం అంటే ఇదే !! ఈ నానుడి ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌ కెరీర్‌‌కు నూటికి నూరుశాతం సరిపోతుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన..ఇప్పుడు వెలవెలబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ‘ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024’  ప్రకారం ఆయన ఆస్తుల నికర విలువ సున్నా. సరిగ్గా ఏడాది క్రితం ఆయన నికర సంపద విలువ రూ. 17,545 కోట్లు. నాటికి నేటికి.. ఆయన సంపద(Billionaire To Zero) ఎంతలా కరిగిపోయిందో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

బైజూస్ అలా ఎదిగి.. ఇలా పడిపోయింది.. 

  • ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌‌ను  2011లో బైజూ రవీంద్రన్ స్థాపించారు. బైజూస్ సంస్థ ఏర్పాటులో ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్ కీలక పాత్ర పోషించారు.
  • బైజూస్ కంపెనీ 2018లో యూనికార్న్ సంస్థల జాబితాలో చేరింది.
  • యూనికార్న్ సంస్థ అంటే  అత్యంత విలువైన  స్టార్టప్ అని అర్థం.
  • కరోనా టైంలో స్కూళ్లు మూతపడటంతో డిజిటల్ అక్షరాస్యతకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సమయంలోనే  బైజూస్ కంపెనీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.
  • అయితే కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత బైజూస్‌కు కష్టకాలం మొదలైంది.
  • 2018 సంవత్సరం నాటికి బైజూస్‌కు 1.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉండేవారు.
  • ప్రస్తుతం ఆ కంపెనీ సబ్‌స్క్రైబర్ల ఘోరంగా పడిపోయింది.
  • విదేశాల్లో బైజూస్‌ కంపెనీ ఏర్పాటు చేసిన బ్రాంచీలు నష్టాల్లో పనిచేస్తున్నాయి.

Also Read :Rahul Gandhis Assets : రాహుల్ గాంధీకి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా ?

  • ఈ పరిణామాలతో బైజూస్‌ అప్పుల కుప్పలో మునిగిపోయింది.
  • 2021 సంవత్సరంలో కంపెనీకి రూ.2.70 లక్షల కోట్ల నష్టాలు వచ్చాయి.
  • ఈనేపథ్యంలో ఒకప్పుడు రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్న బైజూస్ విలువను ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ రూ.8,266 కోట్లకు తగ్గించింది.
  • ఈ ఏడాదిలో ఫిబ్రవరి  23న కంపెనీ వాటాదారులంతా కలిసి రవీంద్రన్‌ను బైజూస్ సీఈఓ పదవి నుంచి తొలగించారు.
  • అయితే తనపై కంపెనీ బోర్డు చేసిన ఆరోపణలను బైజు రవీంద్రన్, ఆయన కుటుంబం ఖండించింది. అంతర్గత కంపెనీ చట్టాలను ఈ సమావేశం ఉల్లంఘించిందని, కనీసం ఒక వ్యవస్థాపక డైరెక్టర్ ఈజీఎంలో ఉండాలని తెలిపింది.
  • బైజూస్ సీఈఓ పదవి నుంచి తనను తొలగించడాన్ని కోర్టులో సవాలు చేస్తానని  అప్పట్లో రవీంద్రన్‌ ప్రకటించారు.
  • డబ్బులు లేకపోవడంతో వేతనాలు చెల్లించలేక.. చాలామంది ఉద్యోగులను బైజూస్ ఇప్పటికే తొలగించింది.

Also Read :Shock To Chirag : చిరాగ్ పాశ్వాన్‌‌కు షాక్.. 22 మంది ‘ఇండియా’ కూటమిలోకి!