Site icon HashtagU Telugu

Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు

A wonderful chapter has ended: CM Chandrababu

A wonderful chapter has ended: CM Chandrababu

Virat Kohli :  భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ ఆటతీరు, క్రీడాపట్ల నిబద్ధత, నాయకత్వ గుణాలను ప్రశంసిస్తూ, ఆయన టెస్టు కెరీర్‌ ముగింపు భారత క్రికెట్‌ చరిత్రలో ఓ మైలురాయిగా పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి. అతడు దేశానికి గర్వకారణంగా నిలిచాడు. విరాట్‌ తదుపరి ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.

ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విరాట్‌ కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ స్పందించారు. భారత క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీ ఒక చిరస్థాయిగా నిలిచే పేరు. అద్భుతమైన క్రికెట్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, అనేక రికార్డులు నెలకొల్పిన ఆటగాడిగా భారత దేశాన్ని గర్వపడేలా చేశారు. అతడి ఆటలోని క్రమశిక్షణ, నిబద్ధత ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయి. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సందర్భంలో, మిగతా ఫార్మాట్లలో కూడా మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

విరాట్‌ కోహ్లీ కెరీర్‌ అనేది కేవలం గణాంకాల పరిమితమైతే కాదు అది లక్షలాది అభిమానులకు స్పూర్తిగా నిలిచిన ప్రయాణం. టెస్టుల్లో భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్‌ ఎన్నో చారిత్రక విజయాలు సాధించింది. ఇప్పుడే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, వన్డేలు మరియు టీ20ల్లో తన ప్రతిభను కొనసాగించనున్నాడు. అభిమానులు, మాజీ ఆటగాళ్లు, రాజకీయ నేతలు సహా దేశవ్యాప్తంగా పలువురు ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత క్రికెట్‌లో కోహ్లీ దశాబ్దకాలపు ప్రభావం ఓ చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోతుంది.

Read Also: Dalai Lama: ద‌లైలామా మెచ్చిన పుస్త‌కం.. విశేషాలీవే!