BRS MLAs: దమ్ముంటే సిట్టింగులకే సీటివ్వాలి: షర్మిల ఛాలెంజ్

తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

BRS MLAs: తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చాడు అంటూ కామెంట్స్ చేశారు. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారని విమర్శించారు. తొమ్మిదేండ్ల నుంచి అవినీతి ఏరులై పారించి, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడంటూ హాట్ కామెంట్స్ చేసారు షర్మిల.

కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు దొర గారు దర్జాగా గడీల్లో ఉంటే.. ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారని సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు.కబ్జాలకు,అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వాళ్లను చితకబాదారు.ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న దొర గారు ఉలిక్కిపడుతున్నారు.సిట్టింగులకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే… సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నాడు.

ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప తాను గట్టెక్కలేనని తెలుసుకున్నాడు. దొర కేసీఆర్ కి YSR తెలంగాణ పార్టీ సవాల్ విసురుతోంది. మీది అవినీతిరహిత పాలనే అయితే, హామీలు నెరవేర్చి ఎన్నికల మ్యానిఫెస్టోకి న్యాయం చేసిన వారే అయితే,మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవండి. మీరు, మీ ఎమ్మెల్యేలు సుద్ధపూసలు అయితే గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని ప్రూవ్ చేయండి. కేసీఆర్ గారు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించండి అంటూ సీఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా ఛాలెంజ్ చేశారు.

Also Read: Muddy Water : అల్లూరి జిల్లాలో దారుణం : త్రాగు నీరు లేక బురద నీరు తాగుతున్న గిరిజనులు